సినీ రంగంలో ఎలాంటి కథానాయిక అయినా ఏదో ఒక దశలో గ్లామర్ రూట్లోకి రావాల్సిందే. చాలా ట్రెడిషనల్గా కనిపించే హీరోయిన్లు కూడా కొన్ని సినిమాల్లో చాలా సెక్సీగా కనిపించిన సందర్భాలున్నాయి. ఈ తరంలో సాయిపల్లవి లాంటి అరుదైన హీరోయిన్లకు మాత్రమే ఆ రూట్లోకి వెళ్లాల్సిన అవసరం పడలేదు. ఒకప్పుడు చాలా ట్రెడిషనల్గా కనిపించిన ఈషా రెబ్బా ఇప్పుడు ఎంత హాట్గా తయారైందో తెలిసిందే.
‘అందాల రాక్షసి’ సినిమాలో సంప్రదాయ తెలుగమ్మాయిలా కనిపించి కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన లావణ్య త్రిపాఠి తర్వాత చేసిన సినిమాల్లో చాలా వరకు పద్ధతిగానే కనిపించింది. కొంచెం సెక్సీగా కనిపించే ప్రయత్నం చేసింది కానీ హద్దులు దాటి అందాల ప్రదర్శన మాత్రం ఎప్పుడూ చేయలేదు. సినిమా అవకాశాలు తగ్గాక కూడా ఆమె ఏమీ రూట్ మార్చలేదు.
ఫొటో షూట్లు చేసినా మరీ హాట్గా ఏమీ కనిపించేది కాదు. కానీ తాజాగా ఆమె తన చుట్టూ గీసుకున్న నియంత్రణ రేఖను దాటేసింది. మునుపెన్నడూ లేనంత హాట్ హాట్గా కనిపిస్తూ ఒక ఫొటో షూట్ చేసింది. ఈ షూట్ ఒక కారు లోపల జరగడం విశేషం. లింగరీలో క్లీవేజ్ షో చేస్తూ.. హాట్ లుక్స్తో కుర్రాళ్లకు వలపు బాణాలు విసిరింది లావణ్య. ఈ పొటోలు చూసి లావణ్య నుంచి ఇంత హాట్నెస్సా అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ ఫొటోలు వెంటనే వైరల్ అయిపోయాయి.
లావణ్యకు మంచి హిట్ పడి చాలా కాలమే అయింది. ఈ ఏడాది ‘ఎ1 ఎక్స్ప్రెస్’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలతో పలకరించిన ఆమెకు చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రస్తుతానికి తన చేతిలో సినిమాలేవీ లేనట్లే ఉన్నాయి. ఈ హాట్ ఫొటో షూట్లయినా ఛాన్సులు తెచ్చిపెడతాయేమో చూద్దాం మరి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…