బాలీవుడ్లో భారీ చిత్రాలకే కాదు.. కాంట్రవర్శీలకి కూడా కేరాఫ్గా నిలుస్తాయి సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు. గుజారిష్, రామ్లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి లాంటి చిత్రాల్లో కంటెంట్ పరంగా కొందరు అభ్యంతరాలు చెప్పడంతో ఆ సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్ని వాటి నుంచి బైటపడ్డాయి. కొన్ని మాత్రం కోతకి గురయ్యాకే బైటికొచ్చాయి. రీసెంట్ మూవీ ‘గంగూబాయ్ కథియావాడి’ విషయంలోనూ వివాదం చెలరేగింది.
ప్రపంచంలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాస్లో ముంబైలోని కామాఠిపుర ఒకటి. ఇక్కడ ఒకప్పుడు గంగూబాయ్ అనే ఆమె ఉండేది. ఓ సాధారణ సెక్స్ వర్కర్గా అక్కడికి వచ్చిన గంగూబాయ్.. తర్వాత ఆ ఏరియా మొత్తమ్మీద పట్టు సాధించింది. లోకల్ లీడర్స్ని, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ని కూడా హడలెత్తించింది. రాజకీయాల్లోకి సైతం వచ్చింది. ఓ సమయంలో సెక్స్ వర్కర్స్ సంక్షేమానికి కూడా పాటు పడింది. ఆమె జీవితాన్నే సినిమాగా తీశాడు భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్లో నటించింది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజవ్వాలి. కానీ షూటింగ్తో పాటు విడుదలకు కూడా కరోనా, లాక్ డౌన్ అడ్డుపడటంతో బాగా లేటయ్యింది. దాంతోపాటు కేసులు కూడా చుట్టుముట్టాయి. తన తల్లి జీవితాన్ని తప్పుగా తీస్తున్నారని, ఆమెని అవమానిస్తే సహించలేది లేదని, వెంటనే ఈ సినిమాని ఆపేయాలని కోరుతూ గంగూబాయ్ కొడుకు కోర్టుకెక్కాడు. భన్సాలీతో పాటు ఆలియా మీద కూడా కేసులు వేశాడు. దాంతో కొన్ని రోజుల పాటు హై టెన్షన్ నడిచింది. కానీ చివరికి కోర్టు కేసులు కొట్టేయడంతో గంగూబాయ్కి లైన్ క్లియర్ అయ్యింది. థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి కనుక, వచ్చేయేడు జనవరి 6న ‘గంగూబాయ్ కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు భన్సాలీ ప్రకటించాడు.
This post was last modified on September 30, 2021 7:10 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…