బాలీవుడ్లో భారీ చిత్రాలకే కాదు.. కాంట్రవర్శీలకి కూడా కేరాఫ్గా నిలుస్తాయి సంజయ్ లీలా భన్సాలీ సినిమాలు. గుజారిష్, రామ్లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి లాంటి చిత్రాల్లో కంటెంట్ పరంగా కొందరు అభ్యంతరాలు చెప్పడంతో ఆ సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్ని వాటి నుంచి బైటపడ్డాయి. కొన్ని మాత్రం కోతకి గురయ్యాకే బైటికొచ్చాయి. రీసెంట్ మూవీ ‘గంగూబాయ్ కథియావాడి’ విషయంలోనూ వివాదం చెలరేగింది.
ప్రపంచంలోని అతి పెద్ద రెడ్ లైట్ ఏరియాస్లో ముంబైలోని కామాఠిపుర ఒకటి. ఇక్కడ ఒకప్పుడు గంగూబాయ్ అనే ఆమె ఉండేది. ఓ సాధారణ సెక్స్ వర్కర్గా అక్కడికి వచ్చిన గంగూబాయ్.. తర్వాత ఆ ఏరియా మొత్తమ్మీద పట్టు సాధించింది. లోకల్ లీడర్స్ని, బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ని కూడా హడలెత్తించింది. రాజకీయాల్లోకి సైతం వచ్చింది. ఓ సమయంలో సెక్స్ వర్కర్స్ సంక్షేమానికి కూడా పాటు పడింది. ఆమె జీవితాన్నే సినిమాగా తీశాడు భన్సాలీ. ఆలియా భట్ టైటిల్ రోల్లో నటించింది.
ఈ సినిమా ఎప్పుడో రిలీజవ్వాలి. కానీ షూటింగ్తో పాటు విడుదలకు కూడా కరోనా, లాక్ డౌన్ అడ్డుపడటంతో బాగా లేటయ్యింది. దాంతోపాటు కేసులు కూడా చుట్టుముట్టాయి. తన తల్లి జీవితాన్ని తప్పుగా తీస్తున్నారని, ఆమెని అవమానిస్తే సహించలేది లేదని, వెంటనే ఈ సినిమాని ఆపేయాలని కోరుతూ గంగూబాయ్ కొడుకు కోర్టుకెక్కాడు. భన్సాలీతో పాటు ఆలియా మీద కూడా కేసులు వేశాడు. దాంతో కొన్ని రోజుల పాటు హై టెన్షన్ నడిచింది. కానీ చివరికి కోర్టు కేసులు కొట్టేయడంతో గంగూబాయ్కి లైన్ క్లియర్ అయ్యింది. థియేటర్లు కూడా తెరుచుకుంటున్నాయి కనుక, వచ్చేయేడు జనవరి 6న ‘గంగూబాయ్ కథియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్లు భన్సాలీ ప్రకటించాడు.
This post was last modified on September 30, 2021 7:10 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…