సౌత్ సూపర్ హిట్స్ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ వారు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటికే చాలా సినిమాలు అక్కడ రీమేక్ అయ్యాయి. ఇంకా అవుతున్నాయి. ముఖ్యంగా రీమేక్స్ లో హిట్టు కొట్టడం ఎలాగో అక్షయ్ కుమార్ ని చూసి తెలుసుకోవాలి. తను నటించిన హాలీడే, బాస్, రౌడీ రాథోడ్, ఖట్టా మీఠా, ఖంబక్త్ ఇష్క్, గరం మసాలా, భూల్ భులయ్యా, హేరాఫేరీ తదితర చిత్రాలన్నీ సౌత్ సినిమాలకు రీమేక్సే.
ఇప్పుడు మరో రీమేక్కి రెడీ అయ్యాడు అక్షయ్. మలయాళ సూపర్ హిట్ ‘డ్రైవింగ్ లైసెన్స్’ హిందీ రీమేక్లో నటించబోతున్నాడు. ఒక స్టార్ హీరోకి, అతని అభిమానికి మధ్య ఏర్పడిన ఇగో క్లాష్ వారి జీవితాలను ఎలా మార్చేసింది అనేది కథ. పృథ్విరాజ్ సుకుమార్ స్టార్ హీరో పాత్రలో నటిస్తే, అతని అభిమాని అయిన ఆర్టీవో ఆఫీసర్ పాత్రని సూరజ్ వెంజరమూడు చేశాడు. హిందీలో పృథ్వి క్యారెక్టర్లో అక్కీ, సూరజ్ పాత్రలో ఇమ్రాన్ హష్మి కనిపించనున్నారు. రాజ్ మెహతా దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించబోతున్నాడు.
నిజానికి ఈ మూవీ తెలుగులోనూ రీమేక్ అవుతోందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. చిరంజీవి హీరోగా బాబి తీయబోయే సినిమా అదేనని టాక్. ఇప్పటికే లూసిఫర్, వేదాళం సినిమాల రీమేక్ లో నటిస్తున్న మెగాస్టార్, ‘డ్రైవింగ్ లైసెన్స్’ కాన్సెప్ట్ను కూడా ఇష్టపడ్డారని, ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా బాబి స్క్రిప్ట్ తయారు చేశాడని, త్వరలోనే సినిమా సెట్స్ కి వెళ్తుందని అంటున్నారు. మొత్తానికి పృథ్వీరాజ్ సినిమాలకి మిగతా భాషల్లో డిమాండ్ బాగా పెరిగింది. ‘లూసిఫర్’ని అతడే డైరెక్ట్ చేశాడు. ఓ పాత్రలో నటించారు కూడా. ఇక పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ ఒరిజినల్ వెర్షన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కూడా పృథ్వి నటించిన సినిమానే!
This post was last modified on September 30, 2021 11:01 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…