మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఊటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీని తరువాత మెహర్ రమేష్ తో ఓ సినిమా, అలానే కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరు.
బాబీ-చిరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కనిపించబోతున్నాడట. కథ పరంగా సినిమాకి మరో హీరో అవసరం రావడంతో దర్శకుడు బాబీ.. రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది.
గతంలో చిరంజీవి-రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత చిరు నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో రవితేజ క్యామియో రోల్ లో కనిపించరు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కించనున్న ఈ సినిమాను అక్టోబర్ లో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు దర్శకుడు. మరి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో..!
This post was last modified on September 29, 2021 12:06 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…