మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను పట్టాలెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. మలయాళ సినిమా ‘లూసిఫర్’కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఊటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. దీని తరువాత మెహర్ రమేష్ తో ఓ సినిమా, అలానే కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరు.
బాబీ-చిరు కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో టాలీవుడ్ హీరో కనిపించబోతున్నాడట. కథ పరంగా సినిమాకి మరో హీరో అవసరం రావడంతో దర్శకుడు బాబీ.. రవితేజను సంప్రదించినట్లు తెలుస్తోంది.
గతంలో చిరంజీవి-రవితేజ కలిసి ‘అన్నయ్య’ అనే సినిమాలో నటించారు. ఆ తరువాత చిరు నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో రవితేజ క్యామియో రోల్ లో కనిపించరు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కించనున్న ఈ సినిమాను అక్టోబర్ లో లాంచ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు దర్శకుడు. మరి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారో..!
This post was last modified on September 29, 2021 12:06 pm
కొన్ని రాజకీయ చర్చలు ఆసక్తిగా ఉంటాయి. ఆయా పార్టీల నాయకులు కూడా.. సుదీర్ఘకాలం చర్చించుకునేలా ఉంటాయి. అలాంటి రాజకీయ చర్చల్లో…
ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.…
పూజా హెగ్డే.. ఒక దశలో టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఉన్న భామ. తమిళంలో కూడా ఆమెకు మంచి క్రేజే…
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…