ప్రస్థానం సినిమాతో తనపై అంచనాలను భారీగా పెంచేశాడు దర్శకుడు దేవా కట్టా. కానీ ఆ తర్వాత ఆయన్నుంచి ఆశించిన సినిమాలు రాలేదు. ఆటోనగర్ సూర్య ఏవో వివాదాల్లో చిక్కుకుని చాలా ఆలస్యంగా విడుదలైంది. ప్రేక్షకుల అంచనాలనూ అందుకోలేకపోయింది. ఆ తర్వాత దేవా ఆశ్చర్యకరంగా ఒక రీమేక్ మూవీ చేశాడు. అదే.. డైనమైట్.
తమిళంలో సూపర్ హిట్టయిన అరిమా నంబికి ఇది రీమేక్. మంచు విష్ణు హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్నందుకుంది. అందులో దేవా ముద్ర అసలేమాత్రం కనిపించలేదు. దేవా ఇలాంటి సినిమా తీశాడేంటన్న విమర్శలు వచ్చాయి.
ఐతే ఆ సినిమాకు దర్శకుడిగా తాను చేసింది పెద్దగా ఏమీ లేదంటూ ఇప్పుడు సంచలన విషయాలు వెల్లడించాడు దేవా. తాను యుఎస్ నుంచి వచ్చేశాక ఫ్రస్టేషన్లో ఉండగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ సినిమాను ఒప్పుకున్నానని.. కానీ ఈ చిత్రానికి సంబంధించి తాను కేవలం తొమ్మిది రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నానని.. తర్వాత వేరే వాళ్లను పెట్టి వాళ్ల ఇష్టమొచ్చినట్లు సినిమా తీసుకున్నారని తన కొత్త చిత్రం రిపబ్లిక్ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన సందర్భంగా దేవా వెల్లడించడం గమనార్హం.
ఇక ప్రస్థానం తర్వాత తన సినిమాలు సరైన ఫలితాలు అందుకోకపోవడానికి కారణాలు చెబుతూ.. ‘‘ప్రస్థానం బ్లాక్బస్టర్ కాకపోవడానికి కామెడీ ట్రాక్ లేకపోవడమో, మరోటో అని నన్ను కన్విన్స్ చేసి, నేను ఆ ట్రాప్లో పడేలా కొందరు చేశారు. ఐతే ఆ తర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్రజలు తిప్పి కొట్టారు. కానీ రిపబ్లిక్ విషయంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా’’ అని దేవా అన్నాడు. తన విజన్లోనే ఈ సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయడానికి ఎంకరేజ్ చేశాడని.. సైనికుడిలా తనకు అండగా నిలబడ్డాడని దేవా చెప్పాడు.
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…
టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…
వచ్చే మూడేళ్లలో తానేంటో చూపిస్తానని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…