Movie News

అక్కీ వర్సెస్ ఆదిపురుష్‌

బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. వచ్చే సంక్రాంతికి ‘రాధేశ్యామ్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’కి కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. నెక్స్ట్‌ ఇయర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 11న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

వచ్చే నెల నుంచి మహారాష్ట్రలో థియేటర్లు తెరుచుకోడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దాంతో నిర్మాతలంతా పోటీపడి తమ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఆదివారం ఒకే రోజున పదమూడు సినిమాల విడుదల తేదీలు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రభాస్ సినిమాకి కూడా డేట్‌ డిసైడ్ చేశారు.

అయితే అదేరోజు అక్షయ్ కుమార్‌‌ సిస్టర్ సెంటిమెంట్ మూవీ ‘రక్షాబంధన్’ కూడా రిలీజ్ కానుంది. దీనివల్ల మిగతా చోట్ల సమస్య లేదు కానీ బాలీవుడ్‌లో మాత్రం కాంపిటీషన్‌ ఏర్పడే అవకాశముంది. ఎందుకంటే ప్రస్తుతం బీటౌన్‌లో అక్కీ హవానే నడుస్తోంది. అతని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంటాయి. ఇక ప్రభాస్ మనకి ఎంత పెద్ద స్టార్ అయినా బాలీవుడ్‌లో ప్రస్తుతానికి కొత్తవాడే, పరాయివాడే. కాకపోతే ఇది బాలీవుడ్‌లో తీస్తున్న సినిమా కాబట్టి లెక్కలు మారే అవకాశం ఉంది. అయినా కానీ అక్కీతో ఆదిపురుష్‌కి పోటీ మాత్రం తప్పకుండా ఉంటుంది.

This post was last modified on September 27, 2021 12:54 pm

Share

Recent Posts

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

7 minutes ago

త్రినాధ్ సంభవాన్ని తక్కువంచనా వేశారా

ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…

11 minutes ago

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

2 hours ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

3 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

3 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago