బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అక్టోబర్ 22 నుంచి థియేటర్లు నడిపేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా కాలంగా విడుదలకు రెడీగా ఉన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి.
ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు తన సినిమాను వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేశారు. నిజానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్ కి కలిసొచ్చే విషయమని చెప్పాలి. ఎందుకంటే తొలిసారి ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు బన్నీ.
క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన కొద్దిరోజులకే ఆమిర్ ఖాన్ సినిమా క్రిస్మస్ కి వస్తుందని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ సినిమాతో పోటీ పడడమనేది ‘పుష్ప’కి పెద్ద విషయం. దీంతో బన్నీ వెనక్కి తగ్గాల్సి వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఈ పోటీ నుంచి తప్పుకొని బన్నీకి లైన్ క్లియర్ చేసేశారు. మరి ‘పుష్ప’ బాలీవుడ్ లో ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి!
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…