బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాతోనే అక్కినేని నాగచైతన్య హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో అక్టోబర్ 22 నుంచి థియేటర్లు నడిపేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అనుమతులు ఇచ్చారు. దీంతో చాలా కాలంగా విడుదలకు రెడీగా ఉన్న సినిమాలన్నీ క్యూ కట్టాయి.
ఇదే క్రమంలో ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ కూడా రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ ఇప్పుడు తన సినిమాను వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పేశారు. నిజానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం అల్లు అర్జున్ కి కలిసొచ్చే విషయమని చెప్పాలి. ఎందుకంటే తొలిసారి ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నారు బన్నీ.
క్రిస్మస్ కానుకగా ‘పుష్ప’ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన కొద్దిరోజులకే ఆమిర్ ఖాన్ సినిమా క్రిస్మస్ కి వస్తుందని అనౌన్స్ చేశారు. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ సినిమాతో పోటీ పడడమనేది ‘పుష్ప’కి పెద్ద విషయం. దీంతో బన్నీ వెనక్కి తగ్గాల్సి వస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమిర్ ఖాన్ ఈ పోటీ నుంచి తప్పుకొని బన్నీకి లైన్ క్లియర్ చేసేశారు. మరి ‘పుష్ప’ బాలీవుడ్ లో ఎలాంటి మార్క్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి!
This post was last modified on September 27, 2021 7:12 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…