సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన తల్లిదండ్రులు కృష్ణ, ఇందిరల మీద ఎంతటి ప్రేమాభిమానులున్నాయో తెలిసిందే. వారి పుట్టిన రోజులప్పుడు, ఇతర సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా వారిపై తన ప్రేమను బయటపెడుతుంటాడు మహేష్. ఐతే తండ్రిని, తల్లిని మహేష్ విడివిడిగా కలిసినపుడు ఫొటోలు కనిపిస్తుంటాయి కానీ.. వాళ్లిద్దరూ ఉన్న ఫొటోలో మహేష్ కనిపించడం అరుదు. అలా కనిపించే అవకాశం ఇప్పుడొచ్చింది కానీ.. అక్కడ మహేష్ లేడు.
ఆదివారం కృష్ణ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కృష్ణ సతీమణి ఇందిర ఆయన్ని కలవడం విశేషం. ఇంతకుముందు పుట్టిన రోజులప్పుడు కృష్ణ పక్కన విజయ నిర్మల ఉండటం వల్లో ఏమో ఆమె ఆయన దగ్గరికెళ్లేవారు కాదు. ఐతే ఇప్పుడు ఆమె లేకపోవడంతో తన కూతుళ్లతో కలిసి ఇందిర కృష్ణ దగ్గరికెళ్లారు.
కృష్ణ ముగ్గురు కూతుళ్లతో పాటు అల్లుడు సుధీర్ బాబు, అతడి పిల్లలు, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఆదివారం ఆయన ఇంటికెళ్లారు. అందరూ ఆయనతోనే రోజంతా గడిపారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కృష్ణ ఆల్ టైం హిట్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’లోని ఓ సన్నివేశాన్ని మొబైల్ ద్వారా కృష్ణకు చూపించాడు.
ఈ వీడియోను ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఫ్యామిలీ గ్రూప్ ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇందులో అందరూ ఉన్నారు కానీ.. మహేష్, అతడి భార్యా పిల్లలు లేని లోటు కనిపించింది. తల్లిదండ్రులిద్దరితో కలిసి మహేష్ చాలా కాలానికి ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం అభిమానులు మిస్సయ్యారు. మహేష్ షేర్ చేసే తల్లి ఫొటోలు చాలా పాతవని తాజా ఫొటోలో ఆమెను చూస్తే అర్థమవుతోంది. వయసు బాగా మీద పడి, అనారోగ్య సమస్యలతో ఆమె వీల్ చైర్కు పరిమితం అయినట్లున్నారు.
This post was last modified on June 1, 2020 1:59 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…