Movie News

పవన్ స్పీచ్ పై నాని రియాక్షన్..!

హీరో సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అంశాలతో పాటు.. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏపీలో టికెట్స్ ప్రభుత్వమే అమ్ముతుందనే విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.

ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ధైర్యంగా ఏపీ ప్రభుత్వంలో మాట్లాడాలని సూచించారు. పవన్ తన స్పీచ్ లో ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోల గురించి మాట్లాడారు. అందరూ ఒక్క మాటపై నిలబడాలని.. ప్రశ్నించడం మన హక్కు అని ప్రోత్సహించారు. ఇదే సమయంలో హీరో నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం నాని థియేటర్ల గురించి మాట్లాడితే.. అందరూ ఆ అబ్బాయ్ ని టార్గెట్ చేశారని.. పాపం తనేం చేస్తాడు.. దమ్ముంటే వైసీపీ ప్రభుత్వాన్ని వెళ్లి అడగమంటూ చురకలు అంటించారు పవన్.

తాజాగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై నాని స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సర్ కి ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెడితే.. సినీ పరిశ్రమ గురించి ఆయన జెన్యూన్ గా మాట్లాడారని.. అందరూ దానిపై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నాని. అలానే.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని. సంబంధిత మంత్రులను సినీ పరిశ్రమను కాపాడమని కోరుతున్నట్లు నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. నాని వేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

This post was last modified on September 26, 2021 3:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

8 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

9 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

10 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

10 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

11 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

13 hours ago