మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అంత స్మూత్ గా వున్నట్లు కనిపించడం లేదు. రీ ఎంట్రీలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్. కానీ సినిమా విడుదలకు ముందు తన రీ ఎంట్రీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మాత్రం పడ్డారు. సరే, అది దాటేసారు. కానీ ఆ తరువాత నుంచే స్టార్ట్ అయింది సమస్య. సైరా అనే సినిమాను తలకెత్తుకున్నారు. ఎప్పటికీ పూర్తి కాలేదు. సరే పూర్తి చేసి విడుదల చేసారు. జనం సింపుల్ గా పక్కన పెట్టారు. దాదాపు నలభై కోట్ల నష్టం మిగిలింది అన్నది ఇండస్ట్రీ గ్యాసిప్.
సరే, ఆ సినిమా సంగతి మరిచిపోయి ఆచార్య సినిమాను స్టార్ట్ చేసారు. కొరటాల శివ దర్శకుడు. కానీ ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది. ఇప్పటికి గట్టిగా సగం కూడా పూర్తి కాలేదని టాక్. అసలు అంత సీన్ లేదు ఇరవై శాతమే పూర్తయిందని ఇంకో గ్యాసిప్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సంకల్పం.
కానీ సినిమాలో రామ్ చరణ్ పాత్ర వ్యవహారం ఇంకా పెండింగ్ లోనే వుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఎప్పుడు వస్తారో? ఎప్పుడు ఆచార్య పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియని సమాధానం. అసలు రామ్ చరణ్ ను వదిలేసుకోవాలా? మరెవర్ని చూసుకోవాలి? అన్నది కూడా క్లారిటీ లేదు. అది రావాలి. ఆపై చరణ్ షూటింగ్ కు రావాలి. నలభై నిమషాలకు పైగా ఫుటేజ్ తీయాలి.
పైగా సినిమా షూట్ జూలై నుంచి మొదలు పెట్టినా ఆరు నెలలు కనీసం వుంటుందని టాక్ వినిపిస్తోంది. అలా అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం అసాధ్యం అవుతుంది. పోనీ సమ్మర్ అనుకుంటే అక్కడ ఆర్ఆర్ఆర్ అడ్డంగా వుంటుంది. మరి కాస్త వెనక్కు వెళ్తే దసరా. ఈ లోగా అనేక టాప్ హీరోల సినిమాలు రెడీ.
ఇలా అన్నీ కలిసి మెగాస్టార్ ఆచార్య పరిస్థితిని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఏదో బాధపడి 2021 సమ్మర్ కు దర్శకుడు కొరటాల శివ బయట పడినా ఏ హీరో కూడా రెడీగా లేరు. అప్పటికి మహేష్, ఎన్టీఆర్ ఇలా ఎవ్వరూ రెడీ కారు. ఆఖరికి కొరటాల ఆశలు పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ కూడా ఫైటర్ తరువాత రెండు సినిమాలు చేయాలి.
ఇలా ఆచార్య సినిమా డైరక్టర్ కొరటాల శివను అష్టదిగ్బంధనం చేసేసింది.
This post was last modified on May 31, 2020 9:52 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…