Movie News

ఆచార్య…అగమ్యగోచరం

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ అంత స్మూత్ గా వున్నట్లు కనిపించడం లేదు. రీ ఎంట్రీలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్. కానీ సినిమా విడుదలకు ముందు తన రీ ఎంట్రీని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ మాత్రం పడ్డారు. సరే, అది దాటేసారు. కానీ ఆ తరువాత నుంచే స్టార్ట్ అయింది సమస్య. సైరా అనే సినిమాను తలకెత్తుకున్నారు. ఎప్పటికీ పూర్తి కాలేదు. సరే పూర్తి చేసి విడుదల చేసారు. జనం సింపుల్ గా పక్కన పెట్టారు. దాదాపు నలభై కోట్ల నష్టం మిగిలింది అన్నది ఇండస్ట్రీ గ్యాసిప్.

సరే, ఆ సినిమా సంగతి మరిచిపోయి ఆచార్య సినిమాను స్టార్ట్ చేసారు. కొరటాల శివ దర్శకుడు. కానీ ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది. ఇప్పటికి గట్టిగా సగం కూడా పూర్తి కాలేదని టాక్. అసలు అంత సీన్ లేదు ఇరవై శాతమే పూర్తయిందని ఇంకో గ్యాసిప్. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సంకల్పం.

కానీ సినిమాలో రామ్ చరణ్ పాత్ర వ్యవహారం ఇంకా పెండింగ్ లోనే వుంది. ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ ఎప్పుడు వస్తారో? ఎప్పుడు ఆచార్య పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియని సమాధానం. అసలు రామ్ చరణ్ ను వదిలేసుకోవాలా? మరెవర్ని చూసుకోవాలి? అన్నది కూడా క్లారిటీ లేదు. అది రావాలి. ఆపై చరణ్ షూటింగ్ కు రావాలి. నలభై నిమషాలకు పైగా ఫుటేజ్ తీయాలి.

పైగా సినిమా షూట్ జూలై నుంచి మొదలు పెట్టినా ఆరు నెలలు కనీసం వుంటుందని టాక్ వినిపిస్తోంది. అలా అయితే ఈ సినిమా సంక్రాంతికి రావడం అసాధ్యం అవుతుంది. పోనీ సమ్మర్ అనుకుంటే అక్కడ ఆర్ఆర్ఆర్ అడ్డంగా వుంటుంది. మరి కాస్త వెనక్కు వెళ్తే దసరా. ఈ లోగా అనేక టాప్ హీరోల సినిమాలు రెడీ.

ఇలా అన్నీ కలిసి మెగాస్టార్ ఆచార్య పరిస్థితిని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఏదో బాధపడి 2021 సమ్మర్ కు దర్శకుడు కొరటాల శివ బయట పడినా ఏ హీరో కూడా రెడీగా లేరు. అప్పటికి మహేష్, ఎన్టీఆర్ ఇలా ఎవ్వరూ రెడీ కారు. ఆఖరికి కొరటాల ఆశలు పెంచుకుంటున్న విజయ్ దేవరకొండ కూడా ఫైటర్ తరువాత రెండు సినిమాలు చేయాలి.

ఇలా ఆచార్య సినిమా డైరక్టర్ కొరటాల శివను అష్టదిగ్బంధనం చేసేసింది.

This post was last modified on May 31, 2020 9:52 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

16 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

33 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

48 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

5 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

9 hours ago