బాలీవుడ్లో మూడేళ్ల కిందట రిలీజై సూపర్ హిట్టయిన థ్రిల్లర్ మూవీ అంధాదున్ తెలుగులో మాస్ట్రోగా రీమేక్ కావడం తెలిసిందే. మాస్ట్రో మొదలైన కొన్ని రోజులకే తమిళంలోనూ అంధాదున్ రీమేక్ను పట్టాలెక్కించారు. అక్కడ సీనియర్ హీరో ప్రశాంత్ ప్రధాన పాత్రలో ఆయన తండ్రి త్యాగరాజన్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలైంది. ఒరిజినల్లో టబు చేసిన పాత్రకు సిమ్రాన్ను తీసుకోగా.. రాధిక క్యారెక్టర్ను ప్రియా ఆనంద్ చేస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యే అవకాశముంది.
కాగా అంధాదున్ మలయాళంలో కూడా రీమేక్ కావడం విశేషం. అక్కడ భ్రమం పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళంలో లీడ్ రోల్ చేశాడు.
టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ రాశి ఖన్నా ఈ చిత్రంతో మలయాళంలో అడుగు పెడుతుండటం గమనార్హం. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్న లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రవి.కె.చంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
తెలుగులో తమన్నా చేసిన టబు పాత్రను అక్కడ మమతా మోహన్ దాస్ చేసింది. ఆమె ప్రియుడి పాత్రలో జనతా గ్యారేజ్, భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటిస్తున్నాడు. మాస్ట్రో తరహాలోనే ఈ చిత్రం కూడా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అక్టోబరు 7న అమేజాన్ ప్రైమ్లో ఈ సినిమా విడుదలవుతోంది. పృథ్వీరాజ్ చివరి రెండు చిత్రాలు కురుతి, కోల్డ్ కేస్ కూడా నేరుగా అమేజాన్ ప్రైమ్లోనే రిలీజై మంచి స్పందన తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. రాశి మాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 23, 2021 7:15 am
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…