Movie News

వక్కంతం వంశీ కథతో శర్వానంద్


యువ కథానాయకుల్లో ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేని విధంగా విభిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకునే నటుడు శర్వానంద్. అతను ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయడు. చివరగా ‘శ్రీకారం’ లాంటి సందేశం ముడిపడ్డ చిత్రంతో పలకరించిన శర్వా.. దానికి ముందు ‘జాను’ లాంటి ప్రేమకథా చిత్రం చేశాడు. ఇప్పుడేమో ‘మహా సముద్రం’ లాంటి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని తర్వాత పూర్తి భిన్నంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే ఫక్తు ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు.

ఆపై ‘గమ్యం’, ‘అందరి బంధువయా’ తరహాలో ‘ఒకే ఒక జీవితం’ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీతో రానున్నాడు శర్వా. ఆపై శర్వా చేయబోయే సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్లో తెరకెక్కబోతుండటం విశేషం.

తమిళంలో రెండు సినిమాలు తీసి.. తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో చూస్తున్న కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం.. శర్వా కొత్త చిత్రాన్ని రూపొందించనున్నాడట. అతను ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ‘కిరాక్ పార్టీ’కి దర్శకత్వం వహించాల్సింది. ముందు ఈ చిత్రానికి అతణ్నే దర్శకుడిగా ప్రకటించారు. కానీ తర్వాత ఏమైందో ఏమో అతనీ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చేశాడు. ఐతే ఇప్పుడు శర్వా కొత్త చిత్రంతో రాజు డైరెక్టర్‌గా తెలుగులోకి అడుగు పెట్టనున్నాడట. వీరి కలయికలో రాబోయే చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నది స్టార్ రైటర్ వక్కంతం వంశీనట.

‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా మారిన వంశీ.. కొన్నేళ్లు రచనకు దూరంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య మళ్లీ కలం ఝులిపిస్తున్నాడు. ‘ఏజెంట్’ మూవీకి కథ అందించాడు. దీంతో పాటు శర్వా-రాజు సినిమాకు కూడా అతను స్క్రిప్టు అందించాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో తెరకెక్కే ఈ చిత్రం గురించి త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

This post was last modified on September 21, 2021 5:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విస్మయపరిచే ‘రామ’ పరిచయం

బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…

45 minutes ago

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

1 hour ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

6 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

8 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

11 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

12 hours ago