Movie News

వక్కంతం వంశీ కథతో శర్వానంద్


యువ కథానాయకుల్లో ఒక సినిమాకు ఇంకో సినిమాకు సంబంధం లేని విధంగా విభిన్నమైన ప్రాజెక్టులు ఎంచుకునే నటుడు శర్వానంద్. అతను ఎప్పుడూ ఒకే తరహా సినిమాలు చేయడు. చివరగా ‘శ్రీకారం’ లాంటి సందేశం ముడిపడ్డ చిత్రంతో పలకరించిన శర్వా.. దానికి ముందు ‘జాను’ లాంటి ప్రేమకథా చిత్రం చేశాడు. ఇప్పుడేమో ‘మహా సముద్రం’ లాంటి యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని తర్వాత పూర్తి భిన్నంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే ఫక్తు ఫ్యామిలీ మూవీ చేస్తున్నాడు.

ఆపై ‘గమ్యం’, ‘అందరి బంధువయా’ తరహాలో ‘ఒకే ఒక జీవితం’ అనే స్లైస్ ఆఫ్ లైఫ్ మూవీతో రానున్నాడు శర్వా. ఆపై శర్వా చేయబోయే సినిమా గురించి ఇప్పుడో ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. ఈ చిత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్లో తెరకెక్కబోతుండటం విశేషం.

తమిళంలో రెండు సినిమాలు తీసి.. తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పట్నుంచో చూస్తున్న కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం.. శర్వా కొత్త చిత్రాన్ని రూపొందించనున్నాడట. అతను ‘కిరిక్ పార్టీ’ రీమేక్ ‘కిరాక్ పార్టీ’కి దర్శకత్వం వహించాల్సింది. ముందు ఈ చిత్రానికి అతణ్నే దర్శకుడిగా ప్రకటించారు. కానీ తర్వాత ఏమైందో ఏమో అతనీ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చేశాడు. ఐతే ఇప్పుడు శర్వా కొత్త చిత్రంతో రాజు డైరెక్టర్‌గా తెలుగులోకి అడుగు పెట్టనున్నాడట. వీరి కలయికలో రాబోయే చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నది స్టార్ రైటర్ వక్కంతం వంశీనట.

‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా మారిన వంశీ.. కొన్నేళ్లు రచనకు దూరంగా ఉన్నాడు. కానీ ఈ మధ్య మళ్లీ కలం ఝులిపిస్తున్నాడు. ‘ఏజెంట్’ మూవీకి కథ అందించాడు. దీంతో పాటు శర్వా-రాజు సినిమాకు కూడా అతను స్క్రిప్టు అందించాడట. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో తెరకెక్కే ఈ చిత్రం గురించి త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.

This post was last modified on September 21, 2021 5:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

39 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

46 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

7 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

10 hours ago