కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తి చేసిన వెంటనే వంశీ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా కోసం విజయ్ వంద కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. నిర్మాత దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. మహేష్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్ ఓకే చేశారట. నిజానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. దీంతో వంశీ ఓ కథ రాసుకొని మహేష్ కి వినిపించాడు. ఆ కథ కొంచెం ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ కి నచ్చలేదట. దీంతో వంశీ పైడిపల్లి ఆ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
చెప్పిన సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. మహేష్ వద్దన్న కథనే విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. మహేష్ కి అంటే ఆల్రెడీ చేసిన జోనర్ అనిపించొచ్చు కానీ విజయ్ కి ఆ కథ కొత్తగానే అనిపించడంతో ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా సినిమా ఓకే చేసేశాడట. అలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథ మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.
This post was last modified on September 21, 2021 2:31 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…