కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తి చేసిన వెంటనే వంశీ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా కోసం విజయ్ వంద కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. నిర్మాత దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. మహేష్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్ ఓకే చేశారట. నిజానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. దీంతో వంశీ ఓ కథ రాసుకొని మహేష్ కి వినిపించాడు. ఆ కథ కొంచెం ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ కి నచ్చలేదట. దీంతో వంశీ పైడిపల్లి ఆ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
చెప్పిన సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. మహేష్ వద్దన్న కథనే విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. మహేష్ కి అంటే ఆల్రెడీ చేసిన జోనర్ అనిపించొచ్చు కానీ విజయ్ కి ఆ కథ కొత్తగానే అనిపించడంతో ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా సినిమా ఓకే చేసేశాడట. అలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథ మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.
This post was last modified on September 21, 2021 2:31 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…