కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తి చేసిన వెంటనే వంశీ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా కోసం విజయ్ వంద కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. నిర్మాత దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. మహేష్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్ ఓకే చేశారట. నిజానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. దీంతో వంశీ ఓ కథ రాసుకొని మహేష్ కి వినిపించాడు. ఆ కథ కొంచెం ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ కి నచ్చలేదట. దీంతో వంశీ పైడిపల్లి ఆ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
చెప్పిన సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. మహేష్ వద్దన్న కథనే విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. మహేష్ కి అంటే ఆల్రెడీ చేసిన జోనర్ అనిపించొచ్చు కానీ విజయ్ కి ఆ కథ కొత్తగానే అనిపించడంతో ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా సినిమా ఓకే చేసేశాడట. అలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథ మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.
This post was last modified on September 21, 2021 2:31 pm
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…