కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రస్తుతం ‘బీస్ట్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న విజయ్.. అది పూర్తి చేసిన వెంటనే వంశీ సినిమా సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఈ సినిమా కోసం విజయ్ వంద కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడని.. నిర్మాత దిల్ రాజు అంత మొత్తాన్ని ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. కథ కూడా లాక్ అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇక్కడ విషయమేమిటంటే.. మహేష్ రిజెక్ట్ చేసిన కథనే విజయ్ ఓకే చేశారట. నిజానికి ‘మహర్షి’ సినిమా తరువాత మహేష్ బాబు-వంశీ పైడిపల్లి కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. దీంతో వంశీ ఓ కథ రాసుకొని మహేష్ కి వినిపించాడు. ఆ కథ కొంచెం ‘శ్రీమంతుడు’, ‘మహర్షి’ సినిమాలకు దగ్గరగా ఉండడంతో మహేష్ కి నచ్చలేదట. దీంతో వంశీ పైడిపల్లి ఆ ఫ్లేవర్ రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు.
చెప్పిన సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. మహేష్ వద్దన్న కథనే విజయ్ కి వినిపించాడు వంశీ పైడిపల్లి. మహేష్ కి అంటే ఆల్రెడీ చేసిన జోనర్ అనిపించొచ్చు కానీ విజయ్ కి ఆ కథ కొత్తగానే అనిపించడంతో ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా సినిమా ఓకే చేసేశాడట. అలా ఒక స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కథ మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్లింది.
This post was last modified on September 21, 2021 2:31 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…