Movie News

చరణ్ సినిమాలో స్పెషల్ ఎపిసోడ్.. పది కోట్లతో ట్రైన్ సెట్!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నారనే ప్రశ్న చాలా కాలం అభిమానులను వెంటాడింది. ఫైనల్ గా దర్శకుడు శంకర్ తో సినిమా అనౌన్స్ చేయగానే.. ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోయారు. సౌతిండియన్ టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తగ్గట్లే ఈ సినిమాను భారీగా తెరకెక్కించడానికి ఫిక్స్ అయ్యారు. రాజకీయాలు, కోర్టుల చుట్టూ తిరిగే కథ అని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ కలెక్టర్ పాత్రలో కనిపిస్తారట.

దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శంకర్ స్పెషల్ ట్రైన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారట. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయబోతున్నారని తెలుస్తోంది. సినిమాలో ఈ ఒక్క సన్నివేశం కోసం చాలా ఖర్చు పెట్టాలని, ఎక్కువ రోజులు షూట్ చేయాలని అనుకుంటున్నారట. ఇదొక భారీ యాక్షన్ ఎపిసోడ్. దీని కోసం వందల మంది ఫైటర్లు అవసరం ఉంటుందట.

ఈ సినిమా మొత్తానికి ట్రైన్ ఎపిసోడ్ మెయిన్ హైలైట్ గా నిలవబోతుందని చెబుతున్నారు. దీనికోసం స్పెషల్ గా సెట్ వేయాల్సిందేనట. ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం. మొత్తంగా ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్ లో తీయాలనుకుంటున్నారు. కానీ శంకర్ సినిమా బడ్జెట్ ను అంతకంతకు పెంచేసే అవకాశం ఉంది. నిర్మాత దిల్ రాజు దీనికి రెడీగానే ఉండి ఉంటారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. అంజలి, సునీల్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

This post was last modified on September 21, 2021 2:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago