టాలీవుడ్ యువ కథానాయకుడు అడవి శేష్ అనారోగ్యం బారిన పడ్డారు. అడవి శేష్ కి ఇటీవల డెంగ్యూ సోకింది. రక్తంలో ప్లేటేట్లు కూడా పడిపోవడంతో.. ఆయన నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరడం గమనార్హం.
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. వైద్యుల పర్యవేక్షిస్తున్నారని ఆయన టీమ్ ప్రకటించింది. ఈనెల 18వ తేదీన ఆస్పత్రిలో చేరారని.. కోలుకుంటున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా.. అడవి శేష్ విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయన ఆ తర్వాత హీరోగా మారారు. ముఖ్యంగా గూఢచారి.. ఎవరు వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆయన విపరీతంగా ఆకట్టుకున్నారు.
విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలతో ఆయన తక్కువ సినిమాలతోనే ప్రత్యేకత నిరూపించుకున్న అడవి శేష్ ఆస్పత్రి పాలైన విషయం తెలియడంతో అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు మెసేజ్లు చేస్తుండటం విశేషం.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్నంటిన విషయాన్ని కళ్లకు కట్టిన ఇటీవలి ప్రభుత్వ భూముల వేలం పెను…
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…