సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ రెడీ చేశారని వార్తలొచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ నవల హక్కులను కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇప్పటివరకు మహేష్ కి కథ సెట్ చేయలేదట.
నిజానికి రాజమౌళి-మహేష్ బాబుల మధ్య ఇప్పటివరకు కథకు సంబంధించి చర్చలు జరిగాయి. రాజమౌళి రెండు, మూడు లైన్లు మహేష్ కి వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ కూడా మహేష్ ని సంతృప్తిపరచలేకపోయింది. దీంతో మహేష్.. సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యమైనా పర్లేదు టైమ్ తీసుకొని స్టోరీ రెడీ చేయమని రాజమౌళికి చెప్పారట. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న మహేష్ బాబు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. అలా చూసుకుంటే 2022 చివరికి కానీ రాజమౌళి-మహేష్ సినిమా పట్టాలెక్కదు. ఈలోగా.. రాజమౌళి బాలీవుడ్ లో చిన్న సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ సినిమా కథ రెడీ చేస్తే సరిపోతుంది.
This post was last modified on September 20, 2021 12:04 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…