సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ రెడీ చేశారని వార్తలొచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ నవల హక్కులను కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇప్పటివరకు మహేష్ కి కథ సెట్ చేయలేదట.
నిజానికి రాజమౌళి-మహేష్ బాబుల మధ్య ఇప్పటివరకు కథకు సంబంధించి చర్చలు జరిగాయి. రాజమౌళి రెండు, మూడు లైన్లు మహేష్ కి వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ కూడా మహేష్ ని సంతృప్తిపరచలేకపోయింది. దీంతో మహేష్.. సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యమైనా పర్లేదు టైమ్ తీసుకొని స్టోరీ రెడీ చేయమని రాజమౌళికి చెప్పారట. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న మహేష్ బాబు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. అలా చూసుకుంటే 2022 చివరికి కానీ రాజమౌళి-మహేష్ సినిమా పట్టాలెక్కదు. ఈలోగా.. రాజమౌళి బాలీవుడ్ లో చిన్న సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ సినిమా కథ రెడీ చేస్తే సరిపోతుంది.
This post was last modified on September 20, 2021 12:04 pm
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…