సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తోన్న రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు. మహేష్ కోసం రాజమౌళి జేమ్స్ బాండ్ లాంటి కథ రెడీ చేశారని వార్తలొచ్చాయి. రీసెంట్ గా రాజమౌళి ఈ సినిమా కోసం ఓ ఇంగ్లీష్ నవల హక్కులను కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇన్సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రాజమౌళి ఇప్పటివరకు మహేష్ కి కథ సెట్ చేయలేదట.
నిజానికి రాజమౌళి-మహేష్ బాబుల మధ్య ఇప్పటివరకు కథకు సంబంధించి చర్చలు జరిగాయి. రాజమౌళి రెండు, మూడు లైన్లు మహేష్ కి వినిపించాడు. అయితే అందులో ఏ ఒక్కటీ కూడా మహేష్ ని సంతృప్తిపరచలేకపోయింది. దీంతో మహేష్.. సినిమా చేయడానికి చాలా సమయం ఉందని, ఆలస్యమైనా పర్లేదు టైమ్ తీసుకొని స్టోరీ రెడీ చేయమని రాజమౌళికి చెప్పారట. రచయిత విజయేంద్రప్రసాద్ కొన్నాళ్లుగా ఈ కథపైనే వర్క్ చేస్తున్నారు.
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తోన్న మహేష్ బాబు ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఇది పూర్తి కావడానికి మరో సంవత్సరం ఈజీగా పడుతుంది. అలా చూసుకుంటే 2022 చివరికి కానీ రాజమౌళి-మహేష్ సినిమా పట్టాలెక్కదు. ఈలోగా.. రాజమౌళి బాలీవుడ్ లో చిన్న సినిమా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఆ సినిమా పూర్తయ్యేలోపు మహేష్ సినిమా కథ రెడీ చేస్తే సరిపోతుంది.
This post was last modified on September 20, 2021 12:04 pm
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…