రవితేజ.. రాజమౌళి.. అనుష్క.. వీళ్లందరి కెరీర్లలో ఒక సమమంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. తర్వాత తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. తమిళంలో కార్తీ హీరోగా ‘శౌర్యం’ శివ ‘సిరుత్తై’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రభుదేవా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ఈ సినిమా తీశాడు.
‘విక్రమార్కుడు’ కథకుడైన విజయేంద్ర ప్రసాద్.. హిందీలో ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ స్టూడియో ఆయనకు ఈ పని అప్పగించింది. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
హిందీతో పాటు తెలుగులోనూ ‘విక్రమార్కుడు’ సీక్వెల్ తీయబోతున్నారన్నది తాజా కబురు. హిందీలో అక్షయ్ కుమారే లీడ్ రోల్ చేయనుండగా.. తెలుగులో రవితేజనే సీక్వెల్లో నటించబోతున్నాడట. కొన్ని రోజుల ముందు వరకు తెలుగు వెర్షన్ విషయంలో ఏ చర్చా లేదు కానీ.. ఇప్పుడు ‘విక్రమార్కుడు-2’ తీయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.
ఐతే సీక్వెల్కు రాజమౌళి దర్శకత్వం వహించబోవట్లేదు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలే తీస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో ఓ సినిమాకు ఆయన రెడీ అవుతున్నారు. వేరే ఎవరైనా మాస్ డైరెక్టర్ను పెట్టుకుని ఈ సినిమా తీసే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…