రవితేజ.. రాజమౌళి.. అనుష్క.. వీళ్లందరి కెరీర్లలో ఒక సమమంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. తర్వాత తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. తమిళంలో కార్తీ హీరోగా ‘శౌర్యం’ శివ ‘సిరుత్తై’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రభుదేవా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ఈ సినిమా తీశాడు.
‘విక్రమార్కుడు’ కథకుడైన విజయేంద్ర ప్రసాద్.. హిందీలో ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ స్టూడియో ఆయనకు ఈ పని అప్పగించింది. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
హిందీతో పాటు తెలుగులోనూ ‘విక్రమార్కుడు’ సీక్వెల్ తీయబోతున్నారన్నది తాజా కబురు. హిందీలో అక్షయ్ కుమారే లీడ్ రోల్ చేయనుండగా.. తెలుగులో రవితేజనే సీక్వెల్లో నటించబోతున్నాడట. కొన్ని రోజుల ముందు వరకు తెలుగు వెర్షన్ విషయంలో ఏ చర్చా లేదు కానీ.. ఇప్పుడు ‘విక్రమార్కుడు-2’ తీయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.
ఐతే సీక్వెల్కు రాజమౌళి దర్శకత్వం వహించబోవట్లేదు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలే తీస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో ఓ సినిమాకు ఆయన రెడీ అవుతున్నారు. వేరే ఎవరైనా మాస్ డైరెక్టర్ను పెట్టుకుని ఈ సినిమా తీసే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on September 19, 2021 3:09 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…