రవితేజ.. రాజమౌళి.. అనుష్క.. వీళ్లందరి కెరీర్లలో ఒక సమమంలో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. తర్వాత తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. తమిళంలో కార్తీ హీరోగా ‘శౌర్యం’ శివ ‘సిరుత్తై’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రభుదేవా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ఈ సినిమా తీశాడు.
‘విక్రమార్కుడు’ కథకుడైన విజయేంద్ర ప్రసాద్.. హిందీలో ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ స్టూడియో ఆయనకు ఈ పని అప్పగించింది. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ పని పూర్తయినట్లు సమాచారం.
హిందీతో పాటు తెలుగులోనూ ‘విక్రమార్కుడు’ సీక్వెల్ తీయబోతున్నారన్నది తాజా కబురు. హిందీలో అక్షయ్ కుమారే లీడ్ రోల్ చేయనుండగా.. తెలుగులో రవితేజనే సీక్వెల్లో నటించబోతున్నాడట. కొన్ని రోజుల ముందు వరకు తెలుగు వెర్షన్ విషయంలో ఏ చర్చా లేదు కానీ.. ఇప్పుడు ‘విక్రమార్కుడు-2’ తీయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.
ఐతే సీక్వెల్కు రాజమౌళి దర్శకత్వం వహించబోవట్లేదు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలే తీస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో ఓ సినిమాకు ఆయన రెడీ అవుతున్నారు. వేరే ఎవరైనా మాస్ డైరెక్టర్ను పెట్టుకుని ఈ సినిమా తీసే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
This post was last modified on September 19, 2021 3:09 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…