ప్రస్తుతం దక్షిణాదిన మేటి నటుల్లో ఒకడిగా, అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. సుకుమార్ లాంటి మేటి దర్శకుడు ‘పుష్ప’లో ఛాన్స్ ఇస్తానన్నా ఒప్పుకోలేనంత బిజీ నటుడతను. బాలీవుడ్లో సైతం ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం అడిగితే డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. ఇక దక్షిణాదిన కథానాయికగా మామూలు సినిమాలే చేసి, బాలీవుడ్లో మంచి మంచి సినిమాలతో గొప్ప ఇమేజ్ సంపాదించిన నటి తాప్సి. ఆమె కూడా సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్గా ఉంటోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకోవట్లేదు.
ఇలాంటి ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కథ విషయంలో.. వీళ్ల పెర్ఫామెన్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ ‘అనాబెల్ సేతుపతి’ సినిమా ఈ ఆశలు, అంచనాలకు దరిదాపుల్లో కూడా నిలవలేదు.
మన దగ్గర ఎన్నో ఏళ్ల ముందే పీల్చి పిప్పి చేసేసిన హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటించారు.. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక, యోగి బాబు లాంటి పేరున్న ఆర్టిస్టులో కీలక పాత్రలు పోషించారు కాబట్టి ఇందులో ఎంతో కొంత కొత్తదనం, కొన్ని విశేషాలు ఉంటాయని ఆశిస్తే అలాంటివేమీ సినిమాలో కనిపించలేదు. ఎప్పుడో చూసిన పాత చింతకాయ పచ్చడి హార్రర్ కామెడీ సీన్లే వీటిలోనూ రిపీట్ చేశారు.
హార్రర్ కామెడీ అనగానే ఒక పెద్ద గుంపు.. ఒక పెద్ద భవనంలోకి వెళ్లడం.. అక్కడ దయ్యాల్ని చూసి భయపడటం.. ఒక ఫ్లాష్ బ్యాక్.. ఇలా రొటీన్ టెంప్లేట్లో సాగిపోయిన సినిమా ఇది. ఊరికే హడావుడి తప్పితే సినిమాలో ఏమీ లేదు. చూసిన వాళ్లంతా ఇదేం సినిమా అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడమేంటని తిడుతున్నారు. అన్నిటికంటే మించి సేతుపతి, తాప్సి ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నారన్నది అర్థం కావడం లేదు.
This post was last modified on September 18, 2021 7:04 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…