ప్రస్తుతం దక్షిణాదిన మేటి నటుల్లో ఒకడిగా, అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. సుకుమార్ లాంటి మేటి దర్శకుడు ‘పుష్ప’లో ఛాన్స్ ఇస్తానన్నా ఒప్పుకోలేనంత బిజీ నటుడతను. బాలీవుడ్లో సైతం ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం అడిగితే డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. ఇక దక్షిణాదిన కథానాయికగా మామూలు సినిమాలే చేసి, బాలీవుడ్లో మంచి మంచి సినిమాలతో గొప్ప ఇమేజ్ సంపాదించిన నటి తాప్సి. ఆమె కూడా సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్గా ఉంటోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకోవట్లేదు.
ఇలాంటి ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కథ విషయంలో.. వీళ్ల పెర్ఫామెన్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ ‘అనాబెల్ సేతుపతి’ సినిమా ఈ ఆశలు, అంచనాలకు దరిదాపుల్లో కూడా నిలవలేదు.
మన దగ్గర ఎన్నో ఏళ్ల ముందే పీల్చి పిప్పి చేసేసిన హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటించారు.. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక, యోగి బాబు లాంటి పేరున్న ఆర్టిస్టులో కీలక పాత్రలు పోషించారు కాబట్టి ఇందులో ఎంతో కొంత కొత్తదనం, కొన్ని విశేషాలు ఉంటాయని ఆశిస్తే అలాంటివేమీ సినిమాలో కనిపించలేదు. ఎప్పుడో చూసిన పాత చింతకాయ పచ్చడి హార్రర్ కామెడీ సీన్లే వీటిలోనూ రిపీట్ చేశారు.
హార్రర్ కామెడీ అనగానే ఒక పెద్ద గుంపు.. ఒక పెద్ద భవనంలోకి వెళ్లడం.. అక్కడ దయ్యాల్ని చూసి భయపడటం.. ఒక ఫ్లాష్ బ్యాక్.. ఇలా రొటీన్ టెంప్లేట్లో సాగిపోయిన సినిమా ఇది. ఊరికే హడావుడి తప్పితే సినిమాలో ఏమీ లేదు. చూసిన వాళ్లంతా ఇదేం సినిమా అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడమేంటని తిడుతున్నారు. అన్నిటికంటే మించి సేతుపతి, తాప్సి ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నారన్నది అర్థం కావడం లేదు.
This post was last modified on September 18, 2021 7:04 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…