ప్రస్తుతం దక్షిణాదిన మేటి నటుల్లో ఒకడిగా, అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడిగా కొనసాగుతున్నాడు విజయ్ సేతుపతి. సుకుమార్ లాంటి మేటి దర్శకుడు ‘పుష్ప’లో ఛాన్స్ ఇస్తానన్నా ఒప్పుకోలేనంత బిజీ నటుడతను. బాలీవుడ్లో సైతం ఆమిర్ ఖాన్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా కోసం అడిగితే డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు. ఇక దక్షిణాదిన కథానాయికగా మామూలు సినిమాలే చేసి, బాలీవుడ్లో మంచి మంచి సినిమాలతో గొప్ప ఇమేజ్ సంపాదించిన నటి తాప్సి. ఆమె కూడా సినిమాల ఎంపికలో చాలా సెలక్టివ్గా ఉంటోంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి సినిమానూ ఒప్పేసుకోవట్లేదు.
ఇలాంటి ఆర్టిస్టులు ఇద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారంటే అది చాలా ప్రత్యేకంగా ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కథ విషయంలో.. వీళ్ల పెర్ఫామెన్స్ విషయంలో ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ ‘అనాబెల్ సేతుపతి’ సినిమా ఈ ఆశలు, అంచనాలకు దరిదాపుల్లో కూడా నిలవలేదు.
మన దగ్గర ఎన్నో ఏళ్ల ముందే పీల్చి పిప్పి చేసేసిన హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఐతే విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటించారు.. జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్, రాధిక, యోగి బాబు లాంటి పేరున్న ఆర్టిస్టులో కీలక పాత్రలు పోషించారు కాబట్టి ఇందులో ఎంతో కొంత కొత్తదనం, కొన్ని విశేషాలు ఉంటాయని ఆశిస్తే అలాంటివేమీ సినిమాలో కనిపించలేదు. ఎప్పుడో చూసిన పాత చింతకాయ పచ్చడి హార్రర్ కామెడీ సీన్లే వీటిలోనూ రిపీట్ చేశారు.
హార్రర్ కామెడీ అనగానే ఒక పెద్ద గుంపు.. ఒక పెద్ద భవనంలోకి వెళ్లడం.. అక్కడ దయ్యాల్ని చూసి భయపడటం.. ఒక ఫ్లాష్ బ్యాక్.. ఇలా రొటీన్ టెంప్లేట్లో సాగిపోయిన సినిమా ఇది. ఊరికే హడావుడి తప్పితే సినిమాలో ఏమీ లేదు. చూసిన వాళ్లంతా ఇదేం సినిమా అంటున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడమేంటని తిడుతున్నారు. అన్నిటికంటే మించి సేతుపతి, తాప్సి ఏం చూసి ఈ సినిమా ఒప్పుకున్నారన్నది అర్థం కావడం లేదు.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…