వయసు పెరిగినా.. గ్లామర్ తగ్గినా.. అనుష్కకు తెలుగు, తమిళ భాషల్లో ఉన్న డిమాండే వేరు. అనుష్కతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. కానీ అనుష్కే సినిమాలు ఒప్పుకుంటున్నట్లుగా కనిపించడం లేదు. చివరగా ‘నిశ్శబ్దం’ సినిమాతో పలకరించిన ఆమె.. దాని తర్వాత ఇప్పటిదాకా ఏ సినిమా ఒప్పుకున్నట్లు కనిపించలేదు. మధ్యలో నవీన్ పొలిశెట్టితో కలిసి ఒక వెరైటీ సినిమా ఏదో చేయబోతున్నట్లు వార్తలొచ్చాయి కానీ.. ఎంతకీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. దీని గురించి ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాలేదు.
దీంతో అనుష్క తర్వాత నటించే సినిమా ఏదనే విషయంలో అయోమయం కొనసాగుతోంది. ఐతే కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క తమిళంలో ఓ సినిమా చేయబోతోందట. చివరగా తమిళంలో ‘సింగం-2’లో నటించిన అనుష్క.. ఆ తర్వాత కోలీవుడ్ వైపు చూడలేదు.
నాలుగేళ్లకు పైగా విరామం తర్వాత అనుష్క తమిళంలో ఓ సినిమా అంగీకరించిందని.. అది చాలా స్పెషల్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘చంద్రముఖి’కి ఇప్పుడు తమిళంలో సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఐతే ఇందులో రజినీకాంత్ నటించట్లేదు. ఆయన స్థానాన్ని రాఘవ లారెన్స్ భర్తీ చేయబోతున్నాడు. ‘చంద్రముఖి’ దర్శకుడు పి.వాసునే ఈ చిత్రాన్ని కూడా రూపొందించనున్నాడు. ఆయన ఇప్పటికే కన్నడలో, తెలుగులో ‘చంద్రముఖి’ సీక్వెల్స్ తీశాడు. రెండు చోట్లా ఒకే కథతో సినిమా తెరకెక్కింది. ఐతే కన్నడలో విజయవంతమైన సినిమా.. తెలుగులో మాత్రం డిజాస్టర్ అయింది.
ఐతే ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టి.. తమిళంలో వేరే కథతో ‘చంద్రముఖి-2’ తీయబోతున్నాడు. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసి చాలా కాలమైంది. కానీ సినిమా పట్టాలెక్కలేదు. త్వరలోనే షూటింగ్ మొదుల కానుందట. ఇందులో చంద్రముఖి పాత్రను అనుష్క చేయబోతోందని.. సినిమాలో ఆమెదే అత్యంత ముఖ్యమైన పాత్ర అని అంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.
This post was last modified on September 18, 2021 6:50 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…