ఇండియాలో టాప్ ఫిలిం ఇండస్ట్రీలంటే ముందుగా బాలీవుడ్ పేరు చెప్పి.. ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్ల పేర్లు చెబుతాం. మిగతా చిన్న ఫిలిం ఇండస్ట్రీల్లో మాలీవుడ్ ఒకటి. అక్కడ సినిమాల క్వాలిటీకి ఢోకా ఉండదు కానీ.. దాని మార్కెట్ పరిధి చిన్నది. అందువల్ల మలయాళ సినిమాలు గతంలో అనుకున్నంత పాపులర్ కాలేదు.
కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. ఓటీటీల హవా పెరిగిన ఈ డిజిటల్ కాలంలో మలయాళ సినిమాలకు బాగా గిరాకీ పెరిగింది. అక్కడి సినిమాలను వేరే భాషల వాళ్లు బాగా చూస్తున్నారు. మలయాళ చిత్రాలు వివిధ భాషల్లో పెద్ద ఎత్తున రీమేక్ అవుతున్నాయి. ఈ ఒరవడి మొదలు కావడానికి ముందే దృశ్యం సినిమా పలు భాషల్లోకి వెళ్లింది. తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషల్లో దృశ్యం రీమేక్ అయి అన్ని చోట్లా విజయవంతం కావడం విశేషం.
ఐతే ఓ చిత్రం వివిధ భారతీయ భాషల్లో మాత్రమే రీమేక్ అయితే అందులో ప్రత్యేకతేమీ లేదు. కానీ దృశ్యం ఇప్పటికే రెండు విదేశీ భాషల్లోకి కూడా వెళ్లడం గమనార్హం. శ్రీలంకలో సింహళీస్ భాషలో దీన్ని రీమేక్ చేశార. అలాగే చైనీస్ లాంగ్వేజ్లో సైతం దృశ్యం తెరకెక్కింది. ఆ భాషల్లోనూ విజయవంతమైంది. చైనాలో ఈ సినిమా విజయవంతం కావడంతో.. దానికి కొనసాగింపుగా సొంతంగా సీక్వెల్ తీయడం విశేషం.
కాగా ఇప్పుడు దృశ్యం మరో విదేశీ భాషలోకి వెళ్తోంది. ఇండొనేషియా భాషలో దృశ్యం చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు. ఇందుకోసం అధికారికంగా రీమేక్ రైట్స్ కూడా కొన్నారు. ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రం ఇలా ఇన్ని భాషల్లోకి వెళ్లడం.. అందులో మూడు విదేశీ భాషలు కూడా ఉండటం అరుదైన విషయం. ఇండియాలో ఇదొక అరుదైన రికార్డని చెప్పొచ్చు. దృశ్యం సీక్వెల్ సైతం అద్భుతమైన స్పందన రాబట్టుకుని వివిధ భాషల్లో రీమేక్ అవుతుండటం విశేషం.
This post was last modified on September 17, 2021 11:38 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…