టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది పూజాహెగ్డే. ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలను పూర్తి చేసింది పూజాహెగ్డే. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. పూజాహెగ్డే ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా పవన్ పుట్టినరోజునాడు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పూజాహెగ్డే ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి హీరోయిన్ గా ఆమె ఫైనల్ అయినట్లే. పూజాహెగ్డే తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతుంది. హరీష్ శంకర్ తో మాత్రం ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఇది మూడో సినిమా కావడం విశేషం.
దర్శకనిర్మాతలు త్వరలోనే పూజాహెగ్డే పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డారు.
This post was last modified on September 16, 2021 11:17 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…