టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది పూజాహెగ్డే. ‘ఆచార్య’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రాధేశ్యామ్’ వంటి సినిమాలను పూర్తి చేసింది పూజాహెగ్డే. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించడానికి రెడీ అవుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. పూజాహెగ్డే ఇప్పుడు మరో సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దీనికి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా పవన్ పుట్టినరోజునాడు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను తీసుకోబోతున్నట్లు చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా పూజాహెగ్డే ఈ సినిమా అగ్రిమెంట్ పై సైన్ చేసినట్లు తెలుస్తోంది. కాబట్టి హీరోయిన్ గా ఆమె ఫైనల్ అయినట్లే. పూజాహెగ్డే తొలిసారి పవన్ కళ్యాణ్ తో కలిసి నటించబోతుంది. హరీష్ శంకర్ తో మాత్రం ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఇది మూడో సినిమా కావడం విశేషం.
దర్శకనిర్మాతలు త్వరలోనే పూజాహెగ్డే పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పవన్ ‘భీమ్లా నాయక్’ సినిమాను పూర్తిచేసే పనిలో పడ్డారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…