కరోనా పుణ్యమా అని గత ఏడాదిన్నర కాలంలో ఎన్ని సినిమాలు ఎన్నిసార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్నాయో తెలిసిందే. ఇంతకుముందు లాగా ఒక సినిమా వాయిదా పడుతుంటే జనాలేమీ ఆశ్చర్యపోవట్లేదు. గత వారం వచ్చిన సీటీమార్, ఈ వారం వస్తున్న గల్లీ రౌడీ కూడా ఒకసారి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక వాయిదా పడ్డవే. వచ్చే వారానికి షెడ్యూల్ అయిన లవ్ స్టోరి ఇంతకుముందు రెండుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.
అక్టోబరు 1న రావాల్సిన సాయిధరమ్ తేజ్ సినిమాకు కూడా ఇంతకుముందు ఒక డేట్ అనుకుని అనివార్య పరిస్థితుల్లో వాయిదా వేశారు. అయితే తాజా డేట్ అక్టోబరు 1న కూడా ఈ సినిమా విడుదల కాకపోవచ్చని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగానే జరుగుతున్నాయి.
కానీ అంతా ఓకే అనుకుంటున్న సమయంలో తేజు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతడికి మరీ తీవ్ర గాయాలేమీ కాలేదు. ప్రాణాపాయం లేదు. కానీ గాయాల నుంచి కోలుకుని మామూలుగా తిరగడానికి మాత్రం టైం పట్టేలా ఉంది. వచ్చే నెల రోజుల్లో మాత్రం ఇది జరగకపోవచ్చని తెలుస్తోంది. అతడి కాలర్ బోన్కు శస్త్రచికిత్స కూడా జరగడం తెలిసిందే. తేజు మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి రావచ్చు. ఇంటికి చేరుకున్నా బయటికి రావడానికి టైం పడుతుంది. సినిమా ప్రమోషన్లకు హీరోనే అత్యంత కీలకం. తేజు అలా ఉండగా ప్రమోషణ్లకు రాలేడు.
ప్రమోషన్ల సంగతలా ఉంచితే.. తేజు ఈ స్థితిలో ఉండగా సినిమాను విడుదలకు సిద్ధం చేయడం కష్టమే. కాబట్టి అక్టోబరు 1 నుంచి ఈ చిత్రాన్ని వాయిదా వేయక తప్పకపోవచ్చని అంటున్నారు. తేజు పరిస్థితి చూసుకుని త్వరలోనే కొత్త డేట్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…