Movie News

రాజమౌళినీ వదలట్లేదా?

టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ బేనర్లలో మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. ఇప్పటికే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి బడా హీరోలు.. సుకుమార్, కొరటాల శివ లాంటి టాప్ డైరెక్టర్లతో ఆ సంస్థ సినిమాలు చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, మహేష్ బాబులతో పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలను నిర్మిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతోనూ మైత్రీ సినిమాలు లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్-జూనియర్ ఎన్టీఆర్ కలయికలోనూ మైత్రీ ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తోనూ తమ సంస్థలో ఓ సినిమా ఉంటుందని మైత్రీ అధినేతలు ఇంతకుముందే వెల్లడించారు. ఇలా టాప్ హీరోలు, దర్శకులు ఎవ్వరినీ మైత్రీ వాళ్లు వదలట్లేదు. ఇప్పుడు వారి కళ్లు దర్శక ధీరుడు రాజమౌళి మీదా పడ్డట్లు సమాచారం.

తన పాత కమిట్మెంట్లు ఒక్కొక్కటిగా పూర్తి చేసే క్రమంలో ముందుగా డీవీవీ దానయ్యతో ‘ఆర్ఆర్ఆర్’ చేశాడు రాజమౌళి. ఆ తర్వాత మరో సీనియర్ నిర్మాత కె.ఎల్.నారాయణకు ఇచ్చిన హామీ మేరకు మహేష్ బాబుతో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. దీని తర్వాత రాజమౌళి ఏ బేనర్‌కు సినిమా చేస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. ఐతే నారాయణ-మహేష్ సినిమా అయ్యాక జక్కన్న మైత్రీ సంస్థలో ఓ మెగా మూవీ చేస్తాడని వార్తలొస్తున్నాయి.

ఇటీవలే రాజమౌళిని మైత్రీ అధినేతలు రవిశంకర్, నవీన్ కలిశారని.. వీరి కలయికలో ఓ సినిమా కోసం సూచనప్రాయంగా అంగీకారం కుదిరిందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మైత్రీ సంస్థలో ఏం చేసినా భారీగానే ఉంటుంది. ఇక రాజమౌళితో సినిమా అంటే ఎన్ని వందల కోట్లయినా బడ్జెట్ పెట్టడానికి వాళ్లు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఈ బేనర్లో ఒక భారీ పాన్ ఇండియా మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చన్నమాట.

This post was last modified on September 15, 2021 10:28 am

Share
Show comments

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

3 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago