ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందం సమావేశం కాబోతోందని నెలా నెలన్నర కిందటే వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరలతో పాటు వివిధ సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఈ మీటింగ్కు ఆహ్వానిస్తూ మంత్రి పేర్ని నాని.. చిరు బృందాన్ని కలవడం.. ఆ తర్వాత ఈ మీటింగ్లో ఏం మాట్లాడాలన్నదానిపై మెగాస్టార్ సినీ పెద్దలతో సమావేశం నిర్వహించడం తెలిసిందే.
ఐతే ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ సమావేశం మాత్రం ఎంతకీ జరగట్లేదు. సీఎం జగన్ సిమ్లా పర్యటన అనంతరం మీటింగ్ అన్నారు కానీ.. ఆ తర్వాత కూడా చప్పుడు లేదు. దీంతో అసలీ మీటింగ్ ఉంటుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. ఐతే ఎట్టకేలకు ఈ సమావేశానికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.
ఈ నెల 20వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ను మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలోని చిత్రపరిశ్రమ బృందం కలవనున్నట్లు సమాచారం. జగన్తో అపాయింట్మెంట్ను ఖరారు చేస్తూ మంత్రి పేర్ని నాని నుంచి చిరు బృందానికి సమాచారం అందినట్లు తెలిసింది. ఈ సమావేశంలో హీరో నాగార్జున, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్బాబు తదితరులు పాల్గొనున్నారట.
వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సందర్భంగా టికెట్ల రేట్లపై నియంత్రణ తీసుకురావడం టాలీవుడ్కు తీవ్ర ఇబ్బందికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమస్యతో పాటు కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వాలని.. కరోనా షరతులు తొలగించి నగరాలు, పట్టణాల్లో రోజుకు నాలుగు షోలు ప్రదర్శించే వెసులుబాటు కల్పించాలని ఈ సమావేశంలో జగన్కు చిరు బృందం విన్నవించనుంది. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టనున్న టికెట్ల విక్రయానికి సంబంధించిన యాప్ గురించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
This post was last modified on September 14, 2021 8:03 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…