టాలీవుడ్లో సంక్రాంతి తర్వాత బాగా సందడి కనిపించే పండుగ సీజన్ అంటే దసరానే. ఐతే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దసరా కళ తప్పింది. థియేటర్లు పూర్తిగా మూతబడి ఉండటంతో సినిమా సందడే లేకపోయింది. ఈసారి దసరాకు రెండు నెలల ముందే థియేటర్లు తెరుచుకున్నాయి. వారం వారం బాగానే సినిమాలు రిలీజవుతున్నాయి. దసరా సమయానికి థియేటర్లు పునర్వైభవం సంతరించుకుంటాయని ఆశిస్తున్నారు.
ఐతే ఈ పండక్కి ముందు అనుకున్న భారీ చిత్రాల సందడి అయితే కనిపించేలా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ వాయిదా పడింది. ‘ఆచార్య’ సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చివరి ‘భారీ’ ఆశ అంటే.. ‘అఖండ’నే. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల బ్లాక్బస్టర్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.
మొన్నటిదాకా ‘అఖండ’ దసరాకు పక్కా అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండక్కి నెల రోజుల మాత్రమే సమయం ఉండగా.. ఈ సినిమా రిలీజ్ గురించి అప్డేట్ లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న సమాచారం బాలయ్య అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. కొత్త షెడ్యూల్ కోసం గోవాకు వెళ్లింది చిత్ర బృందం. త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి..సినిమాను దసరా రేసులో నిలుపుతారన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఆ పండక్కి సినిమాకు రాదేమో అన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి.
ఒకవేళ ‘అఖండ’ దసరాకు రాని పక్షంలో మరో సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ సినిమా ‘దృశ్యం-2’ ఆ పండక్కి విడుదల చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని ముందు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇటీవలే నిర్ణయాన్ని మార్చుకున్నారని.. థియేట్రికల్ రిలీజ్కు సినిమాను రెడీ చేస్తున్నారని.. వీలును బట్టి దసరాకు విడుదల చేస్తారని అంటున్నారు. దసరా వీకెండ్కు ఆల్రెడీ ‘మహాసముద్రం’ ఫిక్సయింది. ముందు వారం కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్నాయి. మరి ఈ లైనప్ ఖాయం అవుతుందేమో చూడాలి.
This post was last modified on September 13, 2021 6:44 pm
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఏ పెద్ద స్టార్ సినిమాకూ…
కియారా అద్వానీ.. బాలీవుడ్ గ్లామర్ క్వీన్ గా ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తోంది. అమ్మడు ఎలాంటి ఫోటోని పోస్ట్…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటైన ‘పుష్ప: ది రూల్’ విడుదలకు ఇంకో 50 రోజులే సమయం ఉంది.…
వైసీపీ కార్యకర్త, గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు. మూసీ నది…
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న వివాదాలు క్రికెట్ పరంగా మరింత హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. రెండు…