Movie News

బాలయ్య రాకుంటే వెంకీ వస్తాడు

టాలీవుడ్లో సంక్రాంతి తర్వాత బాగా సందడి కనిపించే పండుగ సీజన్ అంటే దసరానే. ఐతే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది దసరా కళ తప్పింది. థియేటర్లు పూర్తిగా మూతబడి ఉండటంతో సినిమా సందడే లేకపోయింది. ఈసారి దసరాకు రెండు నెలల ముందే థియేటర్లు తెరుచుకున్నాయి. వారం వారం బాగానే సినిమాలు రిలీజవుతున్నాయి. దసరా సమయానికి థియేటర్లు పునర్వైభవం సంతరించుకుంటాయని ఆశిస్తున్నారు.

ఐతే ఈ పండక్కి ముందు అనుకున్న భారీ చిత్రాల సందడి అయితే కనిపించేలా లేదు. ‘ఆర్ఆర్ఆర్’ ఆల్రెడీ వాయిదా పడింది. ‘ఆచార్య’ సైతం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇక చివరి ‘భారీ’ ఆశ అంటే.. ‘అఖండ’నే. నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో వస్తున్న ఈ భారీ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మొన్నటిదాకా ‘అఖండ’ దసరాకు పక్కా అంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దసరా పండక్కి నెల రోజుల మాత్రమే సమయం ఉండగా.. ఈ సినిమా రిలీజ్ గురించి అప్‌డేట్ లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదన్న సమాచారం బాలయ్య అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. కొత్త షెడ్యూల్ కోసం గోవాకు వెళ్లింది చిత్ర బృందం. త్వరగా మిగతా షూటింగ్ పూర్తి చేసి..సినిమాను దసరా రేసులో నిలుపుతారన్న ఆశతో ఉన్నారు ఫ్యాన్స్. కానీ ఆ పండక్కి సినిమాకు రాదేమో అన్న అనుమానాలు మాత్రం కొనసాగుతున్నాయి.

ఒకవేళ ‘అఖండ’ దసరాకు రాని పక్షంలో మరో సీనియర్ హీరోగా విక్టరీ వెంకటేష్ సినిమా ‘దృశ్యం-2’ ఆ పండక్కి విడుదల చేస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని ముందు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇటీవలే నిర్ణయాన్ని మార్చుకున్నారని.. థియేట్రికల్ రిలీజ్‌కు సినిమాను రెడీ చేస్తున్నారని.. వీలును బట్టి దసరాకు విడుదల చేస్తారని అంటున్నారు. దసరా వీకెండ్‌కు ఆల్రెడీ ‘మహాసముద్రం’ ఫిక్సయింది. ముందు వారం కొండపొలం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రాబోతున్నాయి. మరి ఈ లైనప్ ఖాయం అవుతుందేమో చూడాలి.

This post was last modified on September 13, 2021 6:44 pm

Share
Show comments

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago