ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని సామ్ కానీ చైతు కానీ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. ఇదిలా ఉండగా.. సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాను సైన్ చేయబోతోందని టాక్.
గతంలో కూడా ఆమెకి బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతుందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వెబ్ సిరీస్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించబోతుంది నయనతార. అందుకే ఇప్పుడు సమంత కూడా ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.
ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ నీ, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా.. అని సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతుంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…