Movie News

సమంత ముంబైకి షిఫ్ట్ అవుతోందా..?

ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని సామ్ కానీ చైతు కానీ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. ఇదిలా ఉండగా.. సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాను సైన్ చేయబోతోందని టాక్.

గతంలో కూడా ఆమెకి బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతుందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వెబ్ సిరీస్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించబోతుంది నయనతార. అందుకే ఇప్పుడు సమంత కూడా ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.

ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ నీ, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా.. అని సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతుంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

1 hour ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

1 hour ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago