ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని సామ్ కానీ చైతు కానీ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. ఇదిలా ఉండగా.. సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాను సైన్ చేయబోతోందని టాక్.
గతంలో కూడా ఆమెకి బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతుందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వెబ్ సిరీస్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించబోతుంది నయనతార. అందుకే ఇప్పుడు సమంత కూడా ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.
ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ నీ, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా.. అని సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతుంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది.
This post was last modified on September 13, 2021 11:57 am
ఎవరైనా సంగీత దర్శకుడికి పేరొచ్చేది అతనిచ్చే మొదటి ఆల్బమ్ ని బట్టే. అది హిట్టయ్యిందా అవకాశాలు క్యూ కడతాయి. లేదూ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం అత్యంత దారుణంగా గడిచిందని చెప్పక తప్పదు. ఓ…
రేపు, ఎల్లుండి బాక్సాఫీస్ కు నాలుగు కొత్త రిలీజులు ఉన్నాయి. మాములుగా అయితే సందడి ఓ రేంజ్ లో ఉండాలి.…
నాయకుడు అన్న వ్యక్తి.. హుందాగా వ్యవహరించాలి. పైగా.. గతంలో ఉన్నస్థాయి పదవులు అలంకరించిన వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే..…
భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా…
బాలీవుడ్ మొదటి సూపర్ హీరో బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రిష్ కు కొనసాగింపుగా క్రిష్ 4 త్వరలో ప్రారంభం…