ఈ మధ్యకాలంలో సమంత పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతుందనే గాసిప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయాన్ని సామ్ కానీ చైతు కానీ పెద్దగా పట్టించుకున్నట్లుగా లేరు. ఇదిలా ఉండగా.. సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలకనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలోనే సమంత ముంబైకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ బాలీవుడ్ సినిమాను సైన్ చేయబోతోందని టాక్.
గతంలో కూడా ఆమెకి బాలీవుడ్ అవకాశాలు వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ ఇప్పుడు ఆమె హిందీ సినిమాల్లో నటించడానికి ఓకే చెబుతుందని సమాచారం. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంతకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. వెబ్ సిరీస్ లో ఆమె పెర్ఫార్మన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పైగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ మేకర్స్ సౌత్ హీరోయిన్ల వైపు చూస్తున్నారు. షారుఖ్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించబోతుంది నయనతార. అందుకే ఇప్పుడు సమంత కూడా ఆ దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకుందట.
ఈలోగా ముంబైలో ఓ ఫ్లాట్ కూడా కొనుగోలు చేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ నీ, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా.. అని సమంత ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బ్రేక్ అవ్వగానే.. బాలీవుడ్ లో ఒకట్రెండు సినిమాలు చేయబోతుంది. రీసెంట్ గా ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత.. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తోంది.
This post was last modified on September 13, 2021 11:57 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…