ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లుక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అతడు బరువు పెరగడంతో నెటిజన్లు బాగా విమర్శించారు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ ‘ఆదిపురుష్’ సినిమాపై పడుతోంది. దర్శకుడు ఓం రౌత్ రాముడి పాత్రలో ప్రభాస్ ను చూపించబోతున్నారు. దీనికోసం ప్రభాస్ తన ఫిజిక్ ను కంప్లీట్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ దర్శకుడు అనుకున్న ఫిజిక్ ను సాధించలేకపోయారు. దీంతో అతడికి ఫుల్ బాడీ టెస్ట్ చేయాలని యూనిట్ నిర్ణయించిందట.
దీంతో దర్శకుడు ఓం రౌత్.. ప్రభాస్ ను తీసుకొని బ్రిటన్ వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. నిజానికి సినిమా అనుకున్న సమయానికి ప్రభాస్ లుక్ బాగానే ఉంది. కానీ ఇంతలో లాక్ డౌన్ పడడంతో.. ప్రభాస్ కాస్త లావెక్కరు. ఆ తరువాత ‘సలార్’ షూటింగ్ కోసం కాస్త బరువు తగ్గి ఇప్పుడు మళ్లీ బరువెక్కారు. ఇలా ప్రభాస్ తన బరువు విషయంలో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం ‘ఆదిపురుష్’ మేకర్లను టెన్షన్ పెడుతోంది. ఫిజిక్ లో తేడాలు వస్తే అవి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
అందుకే బ్రిటన్ లో వరల్డ్ క్లాస్ డైటీషియన్ల ఆధ్వర్యంలో ప్రభాస్ కు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ చేయించి.. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దీనికోసం త్వరలోనే బ్రిటన్ కి వెళ్లబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఆయన చేతిలో ప్రస్తుతానికి మరో మూడు సినిమాలున్నాయి.
This post was last modified on September 12, 2021 4:00 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…