Movie News

బ్రిటన్ కు ప్రభాస్ ప్రయాణం..?

ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లుక్స్ విషయంలో బాగా ట్రోల్ చేశారు. అతడు బరువు పెరగడంతో నెటిజన్లు బాగా విమర్శించారు. ఇప్పుడు అదే ఎఫెక్ట్ ‘ఆదిపురుష్’ సినిమాపై పడుతోంది. దర్శకుడు ఓం రౌత్ రాముడి పాత్రలో ప్రభాస్ ను చూపించబోతున్నారు. దీనికోసం ప్రభాస్ తన ఫిజిక్ ను కంప్లీట్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రభాస్ దర్శకుడు అనుకున్న ఫిజిక్ ను సాధించలేకపోయారు. దీంతో అతడికి ఫుల్ బాడీ టెస్ట్ చేయాలని యూనిట్ నిర్ణయించిందట.

దీంతో దర్శకుడు ఓం రౌత్.. ప్రభాస్ ను తీసుకొని బ్రిటన్ వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. నిజానికి సినిమా అనుకున్న సమయానికి ప్రభాస్ లుక్ బాగానే ఉంది. కానీ ఇంతలో లాక్ డౌన్ పడడంతో.. ప్రభాస్ కాస్త లావెక్కరు. ఆ తరువాత ‘సలార్’ షూటింగ్ కోసం కాస్త బరువు తగ్గి ఇప్పుడు మళ్లీ బరువెక్కారు. ఇలా ప్రభాస్ తన బరువు విషయంలో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం ‘ఆదిపురుష్’ మేకర్లను టెన్షన్ పెడుతోంది. ఫిజిక్ లో తేడాలు వస్తే అవి సినిమాపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

అందుకే బ్రిటన్ లో వరల్డ్ క్లాస్ డైటీషియన్ల ఆధ్వర్యంలో ప్రభాస్ కు పూర్తిస్థాయిలో బాడీ చెకప్ చేయించి.. అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. దీనికోసం త్వరలోనే బ్రిటన్ కి వెళ్లబోతున్నారని సమాచారం. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. ఆయన చేతిలో ప్రస్తుతానికి మరో మూడు సినిమాలున్నాయి.

This post was last modified on September 12, 2021 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

3 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

4 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

4 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

4 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

6 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

7 hours ago