హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్పై మా అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తేజూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నరేష్ ఈ విధంగా స్పందించడం ఏమిటని కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజూ ప్రమాదంపై నరేష్ స్పందనను నిర్మాత నట్టికుమార్ తప్పుపట్టారు. ఇటువంటి సందర్భంలో నరేష్ రేసింగ్ గురించి మాట్లాడటం సరి కాదని అన్నారు.
తేజూకు చికిత్స విజయవంతమై, ఆయన కోలుకుని తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని అందరం దేవుడిని ప్రార్థిద్దామని నట్టికుమార్ అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దని, రాజకీయాలు చేయాలని చూడవద్దని కోరారు. నరేష్ గారు పెద్దవారని, కానీ, ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది తనకు నచ్చలేదని కరాఖండిగా చెప్పేశారు నట్టికుమార్. ఈ సమయంలో రేసింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదని, అయినా, తేజూ రేసింగ్ చేయట్లేదని, మామూలు డ్రస్లో వెళుతున్నారని గుర్తుచేశారు.
తేజూ వెళుతున్న స్పీడ్ కూడా తక్కువ లోనే ఉందని, దురదృష్టవశాత్తూ బ్రేక్ వేసిన చోట ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని చెప్పారు. తేజూ తన ఇంటి నుంచి నరేష్ ఇంటికి వెళుతున్నట్లు కనిపిస్తోందని, నరేష్ చెబుతున్నది రాంగ్ అనిపిస్తోంనది నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. దయచేసి రేసింగ్ వంటి విషయాలు ఇక్కడితో వదిలేసి తేజూ బాగుండాలని కోరుకుందామని నట్టికుమార్ అన్నారు. మరి, నట్టికుమార్ వ్యాఖ్యలపై నరేష్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 12, 2021 8:33 am
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…
ఏపీలో మెడికల్ కాలేజీల అంశంపై పెద్ద దుమారమే రేగుతోంది. కోటి సంతకాల పేరుతో రెండు నెలల పాటు వైసీపీ ఈ…