హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్పై మా అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తేజూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నరేష్ ఈ విధంగా స్పందించడం ఏమిటని కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజూ ప్రమాదంపై నరేష్ స్పందనను నిర్మాత నట్టికుమార్ తప్పుపట్టారు. ఇటువంటి సందర్భంలో నరేష్ రేసింగ్ గురించి మాట్లాడటం సరి కాదని అన్నారు.
తేజూకు చికిత్స విజయవంతమై, ఆయన కోలుకుని తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని అందరం దేవుడిని ప్రార్థిద్దామని నట్టికుమార్ అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దని, రాజకీయాలు చేయాలని చూడవద్దని కోరారు. నరేష్ గారు పెద్దవారని, కానీ, ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది తనకు నచ్చలేదని కరాఖండిగా చెప్పేశారు నట్టికుమార్. ఈ సమయంలో రేసింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదని, అయినా, తేజూ రేసింగ్ చేయట్లేదని, మామూలు డ్రస్లో వెళుతున్నారని గుర్తుచేశారు.
తేజూ వెళుతున్న స్పీడ్ కూడా తక్కువ లోనే ఉందని, దురదృష్టవశాత్తూ బ్రేక్ వేసిన చోట ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని చెప్పారు. తేజూ తన ఇంటి నుంచి నరేష్ ఇంటికి వెళుతున్నట్లు కనిపిస్తోందని, నరేష్ చెబుతున్నది రాంగ్ అనిపిస్తోంనది నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. దయచేసి రేసింగ్ వంటి విషయాలు ఇక్కడితో వదిలేసి తేజూ బాగుండాలని కోరుకుందామని నట్టికుమార్ అన్నారు. మరి, నట్టికుమార్ వ్యాఖ్యలపై నరేష్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 12, 2021 8:33 am
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…