హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్పై మా అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తేజూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నరేష్ ఈ విధంగా స్పందించడం ఏమిటని కొందరు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తేజూ ప్రమాదంపై నరేష్ స్పందనను నిర్మాత నట్టికుమార్ తప్పుపట్టారు. ఇటువంటి సందర్భంలో నరేష్ రేసింగ్ గురించి మాట్లాడటం సరి కాదని అన్నారు.
తేజూకు చికిత్స విజయవంతమై, ఆయన కోలుకుని తిరిగి షూటింగ్స్ లో పాల్గొనాలని అందరం దేవుడిని ప్రార్థిద్దామని నట్టికుమార్ అన్నారు. ఈ సమయంలో రాజకీయాలు వద్దని, రాజకీయాలు చేయాలని చూడవద్దని కోరారు. నరేష్ గారు పెద్దవారని, కానీ, ఈ సందర్భంలో ఆయన మాట్లాడింది తనకు నచ్చలేదని కరాఖండిగా చెప్పేశారు నట్టికుమార్. ఈ సమయంలో రేసింగ్ వ్యవహారం తెరపైకి తీసుకురావడం కరెక్ట్ కాదని, అయినా, తేజూ రేసింగ్ చేయట్లేదని, మామూలు డ్రస్లో వెళుతున్నారని గుర్తుచేశారు.
తేజూ వెళుతున్న స్పీడ్ కూడా తక్కువ లోనే ఉందని, దురదృష్టవశాత్తూ బ్రేక్ వేసిన చోట ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి ప్రమాదం జరిగిందని చెప్పారు. తేజూ తన ఇంటి నుంచి నరేష్ ఇంటికి వెళుతున్నట్లు కనిపిస్తోందని, నరేష్ చెబుతున్నది రాంగ్ అనిపిస్తోంనది నట్టికుమార్ అభిప్రాయపడ్డారు. దయచేసి రేసింగ్ వంటి విషయాలు ఇక్కడితో వదిలేసి తేజూ బాగుండాలని కోరుకుందామని నట్టికుమార్ అన్నారు. మరి, నట్టికుమార్ వ్యాఖ్యలపై నరేష్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 12, 2021 8:33 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…