ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా ఒకటి మొదలైందంటే.. అభిమానుల్లో ఉండే ఉత్సాహమే వేరుగా ఉండేది. ఆయన సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లాంటివి రిలీజైతే సోషల్ మీడియా హోరెత్తిపోయేది. రజినీ మాస్ అవతారం ఎత్తాడంటే వాళ్లకు గూస్ బంప్స్ వచ్చేసేవి. కానీ గత కొన్నేళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. వరుస ఫ్లాపులతో సూపర్ స్టార్ తన ప్రభను కోల్పోయాడు. ఇంతకుముందులా రజినీని చూసి జనాలు ఊగిపోవట్లేదు. పెద్దగా విషయం లేని.. ఒకే టైపు సినిమాలు చేయడం ఆయనకు ప్రతికూలంగా మారింది.
చివరగా రజినీ నుంచి వచ్చిన దర్బార్, పేట సినిమాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పుడు ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో రజినీ చేసిన ‘అన్నాత్తె’ కూడా ప్రేక్షకులకు ఏమంత ఎగ్జైట్మెంట్ ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చూస్తే పరమ రొటీన్గా అనిపించింది.
రెండేళ్ల ముందు వచ్చిన ‘పేట’ సినిమా లుక్కు, అన్నాత్తె లుక్కు పెద్దగా తేడా లేమీ లేదు. పోస్టర్లో ఇంకే రకమైన కొత్తదనం కూడా కనిపించలేదు. తాజాగా బుల్లెట్ మీద వెళ్తూ కత్తి పట్టుకున్న లుక్ ఒకటి రిలీజ్ చేశారు. అది కూడా మామూలుగానే ఉంది. ఇవి చూసిన వాళ్లంతా ఏముంది రజినీ ఎప్పట్లాగే రొటీన్ మాస్ మసాలా మూవీ ఏదో చేస్తున్నాడు అంటూ పెదవి విరుస్తున్నారు. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఈ సినిమా ఉండదని ఒక అంచనాకు వచ్చేస్తున్నారు. ఐతే ఈ పోస్టర్లు చూసి కొందరేమో మరోలా స్పందిస్తున్నారు.
‘కబాలి’ సినిమాలో ఏదో ఉంటుందని భ్రమలు కల్పించేలా పోస్టర్లు వదిలి.. చివరికి తీవ్ర నిరాశకు గురి చేసినట్లు కాకుండా.. ఇలా అంచనాలు తగ్గించేలా.. ప్రేక్షకులు మరీ ఎక్కువ ఆశించకుండా చూడటం మంచిదే అని.. ఇలా తక్కువ అంచనాలతో థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఓ మోస్తరు వినోదం అందించినా చాలని.. శివ సినిమా అంటే ఆమాత్రం మినిమం గ్యారెంటీ ఉంటుందని.. కాబట్టి రజినీ అభిమానులు వర్రీ కావాల్సిన పని లేదని అంటున్నారు.
This post was last modified on September 11, 2021 12:47 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…