ఇంకొక్క రోజులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘సీటీమార్’. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన సినిమా అన్న సంగతి తెలిసిందే. తెలుగులో క్రీడా నేపథ్యంలో వచ్చిన సినిమాలు తక్కువ. అందులోనూ రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలు మరీ అరుదు. ‘జెర్సీ’ లాంటి కొన్ని చిత్రాలు మాత్రమే ఈ కోవలో కనిపిస్తాయి. ‘సీటీమార్’ టీజర్, ట్రైలర్ చూస్తే స్పోర్ట్స్ టచ్ ఉంటూనే.. మాస్, యాక్షన్ అంశాలను హైలైట్ చేస్తూ సైినిమా తీశారని స్పష్టమైంది.
రియలిస్టిక్ స్పోర్ట్స్ డ్రామాలకు హిందీలో మంచి ఆదరణ దక్కుతుంటుంది కానీ.. తెలుగులో అలాంటివి కమర్షియల్గా అంత మంచి ఫలితం దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. ‘జెర్సీ’ గొప్ప సినిమా అయినా.. ఆ స్థాయిలో కమర్షియల్ సక్సెస్ కాని విషయం గమనార్హం.
అందుకే దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రాన్ని ప్యూర్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పట్లేదు. ప్రేక్షకులు అలా అనుకుంటారేమో అన్న భయం కూడా అతడిలో కనిపిస్తోంది. అలాంటి ఫీలింగే ప్రేక్షకులకు కలగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ‘సీటీమార్’ ప్రమోషన్లలో ఇది పక్కా మాస్ మూవీ అనే చెబుతున్నాడు. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం అతను ఇదే సంకేతాలు ఇచ్చాడు. దంగల్, చక్ దె ఇండియా తరహా సినిమా ‘సీటీమార్’ కాదంటూ బలంగా చెప్పాడతను.
స్పోర్ట్స్ టచ్ ఉంటుంది కానీ.. అదే ప్రధానం కాదని.. ఇదొక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అతను నొక్కి వక్కాణించాడు. గోపీచంద్ సినిమాలంటే మాస్ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అతణ్నుంచి ప్రధానంగా ఆశించేది యాక్షన్, కమర్షియల్ అంశాలే. అందుకు తగ్గట్లే టీజర్, ట్రైలర్ కూడా కట్ చేశాడు సంపత్ నంది. ‘గౌతమ్ నంద’తో కొంచెం కొత్తగా ఏదో ట్రై చేసి దెబ్బ తిన్న సంపత్.. ఈసారి పక్కా మాస్ మూవీ తీసినట్లే కనిపిస్తున్నాడు.
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…