ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే మన సినీ తారలు.. ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఎన్ని ఇండస్ట్రీలు కుదేలైనా.. ఓటీటీ మాత్రం పుంజుకుంది. థియేటర్లలో సినిమాలు చూడలేని పరిస్థితుల్లో ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచింది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి రిస్క్ చేయలేని దర్శకనిర్మాతలు ఓటీటీల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
దీంతో సినిమా జనాలు ఓటీటీలను సీరియస్ గా తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించి.. అందరినీ మెప్పించింది. ఒక స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ కు వెళ్లడమంటే సమంతతోనే మొదలైంది. ఇప్పుడు ఆమె భర్త నాగచైతన్య వంతు వచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోతున్నారు.
ఒక్కో ఎపిసోడ్ నలభై నిముషాలు ఉంటుందట. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లుగా సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే.. హారర్ జోనర్ కి ఆమడదూరంలో ఉండే చైతన్య ఇప్పుడు అదే జోనర్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ తన కెరీర్ ఆరంభంలో ’13బి’ అనే హారర్ సినిమా రూపొందించారు. మళ్లీ ఇప్పుడు అదే జోనర్ ను టచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘థాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అది పూర్తికాగానే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సిరీస్ ను శరత్ మరార్ నిర్మించబోతున్నారు.
This post was last modified on September 6, 2021 1:17 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…