ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే మన సినీ తారలు.. ఇప్పుడు ఓటీటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కరోనా కారణంగా ఎన్ని ఇండస్ట్రీలు కుదేలైనా.. ఓటీటీ మాత్రం పుంజుకుంది. థియేటర్లలో సినిమాలు చూడలేని పరిస్థితుల్లో ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచింది. సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ.. థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి రిస్క్ చేయలేని దర్శకనిర్మాతలు ఓటీటీల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
దీంతో సినిమా జనాలు ఓటీటీలను సీరియస్ గా తీసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అమెజాన్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించి.. అందరినీ మెప్పించింది. ఒక స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ కు వెళ్లడమంటే సమంతతోనే మొదలైంది. ఇప్పుడు ఆమె భర్త నాగచైతన్య వంతు వచ్చింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య ఓ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ కోసం చేయబోతున్నారు.
ఒక్కో ఎపిసోడ్ నలభై నిముషాలు ఉంటుందట. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లుగా సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయమేమిటంటే.. హారర్ జోనర్ కి ఆమడదూరంలో ఉండే చైతన్య ఇప్పుడు అదే జోనర్ లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. విక్రమ్ కె కుమార్ తన కెరీర్ ఆరంభంలో ’13బి’ అనే హారర్ సినిమా రూపొందించారు. మళ్లీ ఇప్పుడు అదే జోనర్ ను టచ్ చేయబోతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘థాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతోంది. అది పూర్తికాగానే వెబ్ సిరీస్ ను మొదలుపెట్టబోతున్నారు. ఈ సిరీస్ ను శరత్ మరార్ నిర్మించబోతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…