తెలుగులో బిగ్ బాస్ కొత్త సీజన్ ఎట్టకేలకు మొదలైపోయింది. మూడు వారాల కిందటే ఐదో సీజన్ను అనౌన్స్ చేసిన స్టార్ మా.. ఎక్కువ టైం తీసుకోకుండా షోను మొదలుపెట్టేసింది. అక్కినేని నాగార్జున వరుసగా మూడో పర్యాయం షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్లో ఎన్నడూ లేని విధంగా, అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్లతో ఈ సారి షో మొదలైంది. అందులో ఆకర్షణీయ వ్యక్తులు కొందరున్నారు. అప్పుడే వీరిలోంచి విజేతలయ్యే అవకాశాలున్న వాళ్ల గురించి చర్చ మొదలైపోయింది.
‘బిగ్ బాస్’ విజేత కావడానికి సోషల్ మీడియా ఫాలోయింగ్, సపోర్ట్ అత్యంత కీలకం. ఈ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అందరి కంటే ముందుంటాడనడంలో సందేహం లేదు. యూట్యూబ్లో అతను పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్కు మద్దతుగా భారీగా ఓట్లు పడే అవకాశముంది.
సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య లాంటి షోలతో షణ్ముఖ్ యూత్లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వీటికి యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. అతను ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటే.. యూత్ ఎగబడి చూశారు. షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్కు భారీగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్లంతా అతడి అభిమానులే. అభిమానులు ముద్దుగా షన్ను అని పిలుచుకునే ఈ కుర్రాడు ఇప్పుడు బిగ్ బాస్లో అడుగు పెట్టడంతో వాళ్లందరూ ఈ షోను ఫాలో అవుతారనడంలో సందేహం లేదు.
షణ్ముఖ్ ఎప్పుడు ఎలిమినేషన్లోకి వచ్చినా అతడికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. క్రౌడ్ ఫేవరెట్గా అడుగు పెడుతున్న షణ్ముఖ్ టైటిల్ రేసులో ఉంటాడనడంలో సందేహం లేదు. షోలో బ్లండర్స్ చేసి ఇమేజ్ దెబ్బ తీసుకుంటే తప్ప అతను ఫైనల్ రేసులో ఉండే అవకాశాలు మెండు. అతడితో మిగతా కంటెస్టెంట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. షణ్ముఖ్ను టార్గెట్ చేసే వాళ్లను.. అతడి అభిమానులు టార్గెట్ చేసే అవకాశాలు మెండు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…