Movie News

బిగ్ బాస్‌-5.. ఇత‌డితో మిగ‌తా వాళ్ల‌కు క‌ష్ట‌మే

తెలుగులో బిగ్ బాస్ కొత్త సీజన్ ఎట్టకేలకు మొదలైపోయింది. మూడు వారాల కిందటే ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసిన స్టార్ మా.. ఎక్కువ టైం తీసుకోకుండా షోను మొదలుపెట్టేసింది. అక్కినేని నాగార్జున వరుసగా మూడో పర్యాయం షోను హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్‌లో ఎన్నడూ లేని విధంగా, అత్యధికంగా 19 మంది కంటెస్టెంట్లతో ఈ సారి షో మొదలైంది. అందులో ఆకర్షణీయ వ్యక్తులు కొందరున్నారు. అప్పుడే వీరిలోంచి విజేతలయ్యే అవకాశాలున్న వాళ్ల గురించి చర్చ మొదలైపోయింది.

‘బిగ్ బాస్’ విజేత కావడానికి సోషల్ మీడియా ఫాలోయింగ్, సపోర్ట్ అత్యంత కీలకం. ఈ విషయంలో షణ్ముఖ్ జస్వంత్ అందరి కంటే ముందుంటాడనడంలో సందేహం లేదు. యూట్యూబ్‌లో అతను పెద్ద స్టార్ అన్న సంగతి తెలిసిందే. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్‌కు మద్దతుగా భారీగా ఓట్లు పడే అవకాశముంది.

సాఫ్ట్‌వేర్ డెవలపర్‌, సూర్య లాంటి షోలతో షణ్ముఖ్ యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. వీటికి యూట్యూబ్‌లో వచ్చిన వ్యూస్ చూస్తే ఎవ్వరైనా షాకవ్వాల్సిందే. అతను ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తుంటే.. యూత్ ఎగబడి చూశారు. షణ్ముఖ్ యూట్యూబ్ ఛానెల్‌కు భారీగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. వాళ్లంతా అతడి అభిమానులే. అభిమానులు ముద్దుగా షన్ను అని పిలుచుకునే ఈ కుర్రాడు ఇప్పుడు బిగ్ బాస్‌లో అడుగు పెట్టడంతో వాళ్లందరూ ఈ షోను ఫాలో అవుతారనడంలో సందేహం లేదు.

షణ్ముఖ్ ఎప్పుడు ఎలిమినేషన్లోకి వచ్చినా అతడికి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. క్రౌడ్ ఫేవరెట్‌గా అడుగు పెడుతున్న షణ్ముఖ్ టైటిల్ రేసులో ఉంటాడనడంలో సందేహం లేదు. షోలో బ్లండర్స్ చేసి ఇమేజ్ దెబ్బ తీసుకుంటే తప్ప అతను ఫైనల్ రేసులో ఉండే అవకాశాలు మెండు. అతడితో మిగతా కంటెస్టెంట్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. షణ్ముఖ్‌ను టార్గెట్ చేసే వాళ్లను.. అతడి అభిమానులు టార్గెట్ చేసే అవకాశాలు మెండు.

This post was last modified on September 6, 2021 1:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

3 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

5 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago