రామ్ గోపాల్ వర్మ సినిమాలను ప్రమోట్ చేయడానికి హీరో హీరోయిన్లు అక్కర్లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు అవసరం లేదు. ట్విట్టర్లో ఆయనొక్కడే కూర్చుని సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. టార్గెటెడ్ ఆడియన్స్కు సినిమాను రీచ్ చేయడానికి ఎన్ని గిమ్మిక్కులు చేయాలో అన్నీ చేస్తాడు.
ఈ మధ్య వర్మ మరీ క్రెడిబిలిటీ కోల్పోవడం, ఆయన సినిమాలు నాసిరకంగా తయారవడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. వర్మ శైలి ప్రమోషన్లు చాలా సినిమాలకు బాగానే కలిసొచ్చాయి.
చాలా వరకు వివాదాస్పదమైన కామెంట్లు చేయడం.. అతిశయోక్తి మాటలు చెప్పడం.. ప్రేక్షకులను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేయడం ద్వారా వర్మ వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా సరిగ్గా వర్మనే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
రాహుల్, అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ ఫిలిం ‘నెట్’ ఈ నెల 10న జీ5లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్లో రాహుల్ చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బూతు మాట వాడుతూ ఈ సినిమా గురించి అతను పెట్టిన కామెంట్ వివాదాస్పదమైంది.
దీనిపై నెటిజన్లు చాలామంది విరుచుకుపడ్డారు. సినిమాను ప్రమోట్ చేయడానికి బూతులు వాడతావా అంటూ అతణ్ని తప్పుబట్టారు. ఐతే రాహుల్ ఏమీ తగ్గలేదు. ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట అంటూ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత కూడా ఇదే రీతిలో కామెంట్లు పెడుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.
దేవుళ్లనే వాళ్లు నిజంగా ఉంటే తమ సినిమాను కచ్చితంగా ప్రమోట్ చేస్తారని.. ఎందుకంటే తమ సినిమా మానవాళికి మంచిది చేసేదని రాహుల్ ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే.. ‘‘కేసీఆర్ను బండి తిట్టాడు. ఫడ్నవీస్ ఏదో అన్నాడు. రాహుల్ రామకృష్ణ ‘నెట్’ చూడమన్నాడు’’ అంటూ ఇంకో ట్వీట్లో కామెంట్ చేశాడు. తమ సినిమా చూడాలంటే ధైర్యం కావాలంటూ సంక్షిప్త పదాల్లో మరోసారి బూతులు జోడించి ఇంకో కామెంట్ పెట్టాడు. రాహుల్ తీరు చూస్తుంటే.. రిలీజ్ దగ్గర పడేసరికి రాహుల్ ఇంకా దూకుడు పెంచేలాగే ఉన్నాడు.
This post was last modified on September 5, 2021 3:23 pm
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…