రామ్ గోపాల్ వర్మ సినిమాలను ప్రమోట్ చేయడానికి హీరో హీరోయిన్లు అక్కర్లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు అవసరం లేదు. ట్విట్టర్లో ఆయనొక్కడే కూర్చుని సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. టార్గెటెడ్ ఆడియన్స్కు సినిమాను రీచ్ చేయడానికి ఎన్ని గిమ్మిక్కులు చేయాలో అన్నీ చేస్తాడు.
ఈ మధ్య వర్మ మరీ క్రెడిబిలిటీ కోల్పోవడం, ఆయన సినిమాలు నాసిరకంగా తయారవడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. వర్మ శైలి ప్రమోషన్లు చాలా సినిమాలకు బాగానే కలిసొచ్చాయి.
చాలా వరకు వివాదాస్పదమైన కామెంట్లు చేయడం.. అతిశయోక్తి మాటలు చెప్పడం.. ప్రేక్షకులను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేయడం ద్వారా వర్మ వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా సరిగ్గా వర్మనే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
రాహుల్, అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ ఫిలిం ‘నెట్’ ఈ నెల 10న జీ5లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్లో రాహుల్ చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బూతు మాట వాడుతూ ఈ సినిమా గురించి అతను పెట్టిన కామెంట్ వివాదాస్పదమైంది.
దీనిపై నెటిజన్లు చాలామంది విరుచుకుపడ్డారు. సినిమాను ప్రమోట్ చేయడానికి బూతులు వాడతావా అంటూ అతణ్ని తప్పుబట్టారు. ఐతే రాహుల్ ఏమీ తగ్గలేదు. ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట అంటూ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత కూడా ఇదే రీతిలో కామెంట్లు పెడుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.
దేవుళ్లనే వాళ్లు నిజంగా ఉంటే తమ సినిమాను కచ్చితంగా ప్రమోట్ చేస్తారని.. ఎందుకంటే తమ సినిమా మానవాళికి మంచిది చేసేదని రాహుల్ ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే.. ‘‘కేసీఆర్ను బండి తిట్టాడు. ఫడ్నవీస్ ఏదో అన్నాడు. రాహుల్ రామకృష్ణ ‘నెట్’ చూడమన్నాడు’’ అంటూ ఇంకో ట్వీట్లో కామెంట్ చేశాడు. తమ సినిమా చూడాలంటే ధైర్యం కావాలంటూ సంక్షిప్త పదాల్లో మరోసారి బూతులు జోడించి ఇంకో కామెంట్ పెట్టాడు. రాహుల్ తీరు చూస్తుంటే.. రిలీజ్ దగ్గర పడేసరికి రాహుల్ ఇంకా దూకుడు పెంచేలాగే ఉన్నాడు.
This post was last modified on September 5, 2021 3:23 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…