రామ్ గోపాల్ వర్మ సినిమాలను ప్రమోట్ చేయడానికి హీరో హీరోయిన్లు అక్కర్లేదు. ప్రి రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు అవసరం లేదు. ట్విట్టర్లో ఆయనొక్కడే కూర్చుని సినిమాను ప్రమోట్ చేసుకుంటాడు. టార్గెటెడ్ ఆడియన్స్కు సినిమాను రీచ్ చేయడానికి ఎన్ని గిమ్మిక్కులు చేయాలో అన్నీ చేస్తాడు.
ఈ మధ్య వర్మ మరీ క్రెడిబిలిటీ కోల్పోవడం, ఆయన సినిమాలు నాసిరకంగా తయారవడంతో జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ.. వర్మ శైలి ప్రమోషన్లు చాలా సినిమాలకు బాగానే కలిసొచ్చాయి.
చాలా వరకు వివాదాస్పదమైన కామెంట్లు చేయడం.. అతిశయోక్తి మాటలు చెప్పడం.. ప్రేక్షకులను రెచ్చగొట్టేలా ఏదో ఒకటి చేయడం ద్వారా వర్మ వాళ్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా సరిగ్గా వర్మనే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది.
రాహుల్, అవికా గోర్ ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ ఫిలిం ‘నెట్’ ఈ నెల 10న జీ5లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీన్ని ట్విట్టర్లో రాహుల్ చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నాడు. ఒక బూతు మాట వాడుతూ ఈ సినిమా గురించి అతను పెట్టిన కామెంట్ వివాదాస్పదమైంది.
దీనిపై నెటిజన్లు చాలామంది విరుచుకుపడ్డారు. సినిమాను ప్రమోట్ చేయడానికి బూతులు వాడతావా అంటూ అతణ్ని తప్పుబట్టారు. ఐతే రాహుల్ ఏమీ తగ్గలేదు. ట్విట్టర్లో అందరూ పతిత్తులే అన్నమాట అంటూ కౌంటర్ వేశాడు. ఆ తర్వాత కూడా ఇదే రీతిలో కామెంట్లు పెడుతూ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.
దేవుళ్లనే వాళ్లు నిజంగా ఉంటే తమ సినిమాను కచ్చితంగా ప్రమోట్ చేస్తారని.. ఎందుకంటే తమ సినిమా మానవాళికి మంచిది చేసేదని రాహుల్ ఒక పోస్ట్ పెట్టాడు. అలాగే.. ‘‘కేసీఆర్ను బండి తిట్టాడు. ఫడ్నవీస్ ఏదో అన్నాడు. రాహుల్ రామకృష్ణ ‘నెట్’ చూడమన్నాడు’’ అంటూ ఇంకో ట్వీట్లో కామెంట్ చేశాడు. తమ సినిమా చూడాలంటే ధైర్యం కావాలంటూ సంక్షిప్త పదాల్లో మరోసారి బూతులు జోడించి ఇంకో కామెంట్ పెట్టాడు. రాహుల్ తీరు చూస్తుంటే.. రిలీజ్ దగ్గర పడేసరికి రాహుల్ ఇంకా దూకుడు పెంచేలాగే ఉన్నాడు.
This post was last modified on September 5, 2021 3:23 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…