పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కెరీర్లో ఎన్నడూ లేనంత స్పీడు మీద ఉన్నాడు. రెండేళ్లకు పైగా సినిమాల నుంచి విరామం తీసుకున్నాక.. ఆయన శరవేగంగా రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ను పూర్తి చేశాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’తో పాటు సాగర్ చంద్ర డైరెక్షన్లో ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఈ రెండూ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి.
త్వరలోనే హరీష్ శంకర్ సినిమాను కూడా మొదలుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది కిందటే అనౌన్స్ అయిన ఈ చిత్రాన్ని దసరాకు ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డే నటించనున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా పూజా .. ఈసారి పవన్ పుట్టిన రోజుకు విష్ చేయడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.
ఐతే ఈ చిత్రంలో మరో కథానాయిక కూడా నటించనుందని.. ఆ హీరోయిన్ ప్రియమణి అని వార్తలొస్తున్నాయి. హీరోయిన్గా కొన్నేళ్లు మంచి ఊపులో ఉన్న ప్రియమణి.. తర్వాత డౌన్ అయింది. పెళ్లి చేసుకుని వ్యక్గిగత జీవితంలో సెటిలయ్యాక కొంత కాలం సినిమాలకు దూరమైంది. కానీ ఈ మధ్య మళ్లీ సినిమాల్లో మెరుస్తోంది. ‘నారప్ప’తో పాటు ‘విరాటపర్వం’ చిత్రాల్లో ఆమె నటించింది. పవన్-హరీష్ సినిమాలో ఆమె ప్రధాన కథానాయిక అయితే అయ్యుండకపోవచ్చు. ఆమెది స్పెషల్ రోల్ అయ్యే అవకాశముంది. ఏమో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఏదైనా చేస్తున్నా ఆశ్చర్యం లేదు.
ఐతే ఇక కెరీర్ లేదనుకున్న దశ నుంచి పవన్తో సినిమా చేసే స్థాయికి చేరుకోవడం అంటే విశేషమే. కథానాయికగా మంచి ఊపులో ఉన్న టైంలో కూడా ఆమె పవన్తో కలిసి నటించలేదు. మరి ఈ అవకాశాన్ని ఆమె ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on September 3, 2021 2:28 pm
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…