బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. రిలీజవుతున్నవేమో చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. సరైన సినిమాలు పడితే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. కానీ వారు కోరుకున్న స్థాయి వినోదాన్నందించే సినిమాలు అంతగా రావట్లేదు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత. గత వారం వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. అంతకుముందు వారాల్లో వచ్చిన చిత్రాలు ఇప్పటిదాకా థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు చిన్న సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమయ్యాయి. అవే.. నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘా.
ఈ రెండు చిత్రాల్లో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు ఓ మోస్తరుగా క్రేజ్ కనిపిస్తోంది. హిందీలో వచ్చిన ‘బాలా’ తరహాలో బట్టతల చుట్టూ తిరిగే ఎంటర్టైనర్ ఇది. తెలుగు తెరపై ఎప్పుడూ చూడని ఇలాంటి కథపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది. క్రిష్, దిల్ రాజు లాంటి ప్రముఖులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అవసరాలనే స్వయంగా దీనికి స్క్రిప్టు సమకూర్చాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించాడు. రుహాని శర్మ కథానాయికగా నటించింది.
ఇక మరో చిత్రం ‘డియర్ మేఘా’లో తమిళమ్మాయి మేఘా ఆకాష్ లీడ్ రోల్ చేసింది. అదిత్ అరుణ్ తనకు జోడీగా నటించాడు. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు అబ్బాయిల మధ్య నలిగిపోయే అమ్మాయిగా మేఘా కనిపించనుంది. సుశాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం, లీడ్ రోల్ చేసిన అమ్మాయి ఇంకా తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువ కాకపోవడంతో ఈ సినిమాకు అంతగా బజ్ కనిపించడం లేదు. మరి ఈ రెండు కొత్త చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గరున్న అడ్వాంటేజీని ఏమేర ఉపయోంచుకుంటాయో చూడాలి.
This post was last modified on September 3, 2021 2:21 pm
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…