బోలెడన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. రిలీజవుతున్నవేమో చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. సరైన సినిమాలు పడితే థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నారు. కానీ వారు కోరుకున్న స్థాయి వినోదాన్నందించే సినిమాలు అంతగా రావట్లేదు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ తర్వాత. గత వారం వచ్చిన సినిమాలన్నీ వాషౌట్ అయిపోయాయి. అంతకుముందు వారాల్లో వచ్చిన చిత్రాలు ఇప్పటిదాకా థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు చిన్న సినిమాలు ప్రేక్షకుల తీర్పు కోసం సిద్ధమయ్యాయి. అవే.. నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘా.
ఈ రెండు చిత్రాల్లో అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్ర పోషించిన సినిమాకు ఓ మోస్తరుగా క్రేజ్ కనిపిస్తోంది. హిందీలో వచ్చిన ‘బాలా’ తరహాలో బట్టతల చుట్టూ తిరిగే ఎంటర్టైనర్ ఇది. తెలుగు తెరపై ఎప్పుడూ చూడని ఇలాంటి కథపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కనిపిస్తోంది. క్రిష్, దిల్ రాజు లాంటి ప్రముఖులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అవసరాలనే స్వయంగా దీనికి స్క్రిప్టు సమకూర్చాడు. విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు దీన్ని రూపొందించాడు. రుహాని శర్మ కథానాయికగా నటించింది.
ఇక మరో చిత్రం ‘డియర్ మేఘా’లో తమిళమ్మాయి మేఘా ఆకాష్ లీడ్ రోల్ చేసింది. అదిత్ అరుణ్ తనకు జోడీగా నటించాడు. ఇదొక ముక్కోణపు ప్రేమకథ. ఇద్దరు అబ్బాయిల మధ్య నలిగిపోయే అమ్మాయిగా మేఘా కనిపించనుంది. సుశాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్ ఓ మోస్తరుగా అనిపించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం, లీడ్ రోల్ చేసిన అమ్మాయి ఇంకా తెలుగు ప్రేక్షకులకు అంతగా చేరువ కాకపోవడంతో ఈ సినిమాకు అంతగా బజ్ కనిపించడం లేదు. మరి ఈ రెండు కొత్త చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గరున్న అడ్వాంటేజీని ఏమేర ఉపయోంచుకుంటాయో చూడాలి.
This post was last modified on September 3, 2021 2:21 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…