అందం, అభినయం.. ఇవి రెంటికీ తోడు లవబుల్గా అనిపించే వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్లు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంటారు. ఈ తరం హీరోయిన్లందరూ దాదాపుగా ఇలాగే కనిపిస్తారు. వ్యక్గిగతంగా కూడా అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. సమంత తిరుగులేని ఇమేజ్ సంపాదించడానికి తన పర్సనల్ క్యారెక్టర్ కూడా ఒక కారణం అనడంలో సందేహం లేదు.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలా లవబుల్గా అనిపించే అమ్మాయే. అనుపమ ఇప్పటిదాకా నటించిన ఏ సినిమాలో కూడా తన నటన బాగా లేదు అనేలా ఉండదు. తెలుగులో చేసిన తొలి చిత్రం ‘అఆ’ దగ్గర్నుంచి ప్రతి సినిమాలోనూ నటిగా ఆకట్టుకుంటూనే ఉంది. అందంతోనూ ఆమె మెప్పించింది. అడపాదడపా విజయాలందుకుంటూ ఒక దశ వరకు టాలీవుడ్లో ఆమె బండి బాగానే నడిచింది కానీ.. ఉన్నట్లుండి అవకాశాలు తగ్గిపోయాయి. చివరగా ‘రాక్షసుడు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించిందామె. ఆ సినిమా బాగానే ఆడినప్పటికీ తన కెరీర్కు పెద్దగా ఉపయోగపడలేదు.
ఒక దశలో చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేని అనుపమకు.. ఇక్కడ కెరీర్ అయిపోయినట్లే కనిపించింది. కానీ ఇలాంటి టైంలో సుకుమార్ స్క్రిప్టుతో గీతా ఆర్ట్స్ మొదలుపెట్టిన ‘108 పేజెస్’లో అనుకోకుండా అనుపమకు అవకాశం దక్కింది. ఈ సినిమా చేస్తూ నిఖిల్తో మంచి దోస్తీ కుదిరింది అనుపమకు. సోషల్ మీడియాలో వీళ్లిద్దరి కాన్వర్జేషన్లు చూస్తే మంచి ఫ్రెండ్స్ అయ్యారనే విషయం అర్థమవుతుంది. ఈ స్నేహమే అనుపమ కెరీర్కు ఉపయోగపడుతున్నట్లుంది. నిఖిల్ తర్వాతి చిత్రంలోనూ ఆమెనే కథానాయికగా ఎంచుకున్నారు.
తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ‘కార్తికేయ’కు సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. ఈ చిత్రం గత ఏడాదే పట్టాలెక్కింది. చాలా వరకు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ కథానాయిక ఎవరన్నది బయటపెట్టనే లేదు. జన్మాష్టమి సందర్భంగా ఈ చిత్రంలో అనుపమే కథానాయిక అనే విషయాన్ని వెల్లడించారు. అనుపమతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయాన్ని కూడా నిఖిల్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ఈ సినిమాలో నటించడం పట్ల అనుపమ చాలా ఎగ్జైట్ అయింది. ‘కార్తికేయ’ను రూపొందించిన చందూ మొండేటినే ఈ చిత్రానికీ దర్శకుడు.
This post was last modified on August 31, 2021 7:26 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…