సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా అక్కినేని నాగచైతన్య-సమంతలకు పేరుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడిన దగ్గర్నుంచి.. వార్తల్లో వ్యక్తులే. పెళ్లి తర్వాత తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందీ జంట. సోషల్ మీడియాలో ఈ జంటకుండే ఆదరణే వేరు. బెస్ట్ పెయిర్ అనే మాటకు ఒక ఉదాహరణ లాగా కనిపించే చై-సామ్ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వీళ్లిద్దరూ విడిపోతున్నారని కొన్ని రోజులుగా వార్తలొస్తుండటం వారి అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
తన పేరులో ఉన్న ‘అక్కినేని’ పదాన్ని తీసేయడంతో జనాలకు ముందుగా అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత చైతూతో కలిసి ఉన్న ఫొటోలేవీ షేర్ చేయకపోవడం.. తన గురించి స్పందించకపోవడం.. ఇన్స్టాగ్రామ్లో ఆమె పెడుతున్న పోస్టుల్లో నర్మగర్భపు వ్యాఖ్యలు చేస్తుండటం అనుమానాలను పెంచుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఆదివారం నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన్ని మామా అని సంబోదిస్తూ విషెస్ చెప్పడంతో చైతో ఆమె బంధంపై తలెత్తుతున్న అనుమానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లే కనిపించింది. కానీ ఇది ఉదయం సంగతి. సాయంత్రానికి మళ్లీ కథ మారిపోయింది. మళ్లీ అనుమానాలు ముసురుకున్నాయి. నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడమే ఇందుక్కారణం. ఈ వేడుకలకు నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హాజరయ్యారు. ఇంత ముఖ్యమైన వేడుకకు సమంత హాజరుకాకపోవడం యాదృచ్ఛికం అని అబిమానులు భావించడం లేదు.
ఈ మధ్యే సామ్.. ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైకి వెళ్లింది. ఐతే ఒక పూట విరామం తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనలేనంత ఇబ్బంది అయితే సమంతకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వేడుకలో సామ్ పాల్గొనకపోవడానికి కారణం వేరే అని.. అది చైతూకు దూరంగా ఉండటమే కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ సస్పెన్సుకు చైతూ-సామ్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి.
This post was last modified on August 30, 2021 12:21 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…