సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్గా అక్కినేని నాగచైతన్య-సమంతలకు పేరుంది. వీళ్లిద్దరూ ప్రేమలో పడిన దగ్గర్నుంచి.. వార్తల్లో వ్యక్తులే. పెళ్లి తర్వాత తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందీ జంట. సోషల్ మీడియాలో ఈ జంటకుండే ఆదరణే వేరు. బెస్ట్ పెయిర్ అనే మాటకు ఒక ఉదాహరణ లాగా కనిపించే చై-సామ్ల మధ్య విభేదాలు తలెత్తాయని.. వీళ్లిద్దరూ విడిపోతున్నారని కొన్ని రోజులుగా వార్తలొస్తుండటం వారి అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
తన పేరులో ఉన్న ‘అక్కినేని’ పదాన్ని తీసేయడంతో జనాలకు ముందుగా అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత చైతూతో కలిసి ఉన్న ఫొటోలేవీ షేర్ చేయకపోవడం.. తన గురించి స్పందించకపోవడం.. ఇన్స్టాగ్రామ్లో ఆమె పెడుతున్న పోస్టుల్లో నర్మగర్భపు వ్యాఖ్యలు చేస్తుండటం అనుమానాలను పెంచుతూ వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఆదివారం నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన్ని మామా అని సంబోదిస్తూ విషెస్ చెప్పడంతో చైతో ఆమె బంధంపై తలెత్తుతున్న అనుమానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్లే కనిపించింది. కానీ ఇది ఉదయం సంగతి. సాయంత్రానికి మళ్లీ కథ మారిపోయింది. మళ్లీ అనుమానాలు ముసురుకున్నాయి. నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో సమంత కనిపించకపోవడమే ఇందుక్కారణం. ఈ వేడుకలకు నాగ్ కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హాజరయ్యారు. ఇంత ముఖ్యమైన వేడుకకు సమంత హాజరుకాకపోవడం యాదృచ్ఛికం అని అబిమానులు భావించడం లేదు.
ఈ మధ్యే సామ్.. ఓ తమిళ సినిమా చిత్రీకరణ కోసం చెన్నైకి వెళ్లింది. ఐతే ఒక పూట విరామం తీసుకుని చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చి నాగ్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనలేనంత ఇబ్బంది అయితే సమంతకు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ వేడుకలో సామ్ పాల్గొనకపోవడానికి కారణం వేరే అని.. అది చైతూకు దూరంగా ఉండటమే కావచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి ఈ సస్పెన్సుకు చైతూ-సామ్ ఎప్పుడు తెరదించుతారో చూడాలి.
This post was last modified on August 30, 2021 12:21 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…