ఇప్పుడు ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరో అంటే ప్రభాసే. ఇటు సౌత్.. అటు బాలీవుడ్ సూపర్ స్టార్లను మించి చాలా పెద్ద హీరోగా ఎదిగిపోయాడతను. ‘బాహబలి’తో అతడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఎలా విస్తరించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ తర్వాతి నుంచి ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో వందల కోట్ల బడ్జెట్లోనే తెరకెక్కతున్నాయి.
వివిధ భాషల దర్శకులు ప్రభాస్ కోసం క్యూ కట్టేస్తున్నారు. తన స్థాయికి తగ్గ భారీ కథలు ఒక్కొక్కటిగా ప్రభాస్ ఓకే చేసి సినిమాలు లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ ‘రాధేశ్యామ్’ను విడుదలకు సిద్ధం చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్ చిత్రాల షూటింగ్లో సమాంతరంగా పాల్గొంటున్నాడు. నాగ్ అశ్విన్ సినిమా కూడా మొదలైపోగా.. ఇంకా ప్రభాస్ షూటింగ్కు హాజరు కావాల్సి ఉంది.
ఈ మూడు చిత్రాలూ పూర్తి కావడానికి అటు ఇటుగా ఇంకో రెండేళ్ల సమయమైనా పడుతుంది. ఇప్పట్లో ప్రభాస్ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపించకపోయినా.. ప్రభాస్ దగ్గరికి కథలు వస్తూనే ఉన్నాయి. అతడి నుంచి కమిట్మెంట్ తీసుకోవడానికి నిర్మాతలు, దర్శకులు తెగ ట్రై చేస్తూనే ఉన్నారు. ‘సలార్’ తర్వాత ప్రశాంత్ నీల్తో మరో సినిమా ఓకే చేశాడని.. బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్తోనూ ప్రభాస్కు ఓ సినిమా ఉందని.. ‘సాహో’ దర్శకుడు సుజీత్తోనూ మరో చిత్రం చేస్తాడని వివిధ సందర్భాల్లో వార్తలు రావడం తెలిసిందే.
ఇప్పుడు ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్టుల జాబితాలో ఇంకోటి చేరింది. బాలీవుడ్లో మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన రోహిత్ శెట్టి కూడా ప్రభాస్తో సినిమా కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడట. అతడి కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ప్రభాస్కు ఇప్పటికే ఆ కథ వినిపించాడని.. అతను సూచన ప్రాయంగా అంగీకారం తెలిపాడని.. ఓ అగ్ర నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతుందని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఐతే ఈ సినిమా పట్టాలెక్కాలంటే మాత్రం కనీసం మూడేళ్లయినా సమయం పట్టేలా ఉంది.
This post was last modified on August 29, 2021 6:37 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…