మొత్తానికి చాలా ఏళ్ల విరామం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులు కలిసి నటించబోతున్నారు. ఇంతకుముందు మనం లాంటి మరపురాని సినిమా కోసం జత కట్టిన నాగార్జున, నాగచైతన్య.. ఈసారి బంగార్రాజు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తండ్రీ కొడుకులు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా.. పైగా సొంత బేనర్లో తెరకెక్కుతుండటం.. అందులోనూ సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఐతే ఈ చిత్రంలో చైతూ పాత్ర ఏంటి అన్న విషయంలో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు నాగార్జున. ఇందులో నాగార్జున, నాగచైతన్యల పేర్లను వేసి.. కింద ఇన్ అండ్ యాజ్ బంగార్రాజు అంటూ టైటిల్ వేశారు.
అంటే తండ్రీ కొడుకులిద్దరూ బంగార్రాజు పాత్రనే చేస్తున్నారా.. యుక్త వయసులో బంగార్రాజుగా చైతూ కనిపించి.. వయసు మళ్లాక నాగార్జున ఆ పాత్రలో దర్శనమిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే.. నాగ్-చైతూ సినిమాలో కలిసి కనిపించే అవకాశం లేనట్లే. అలా కాకుండా వీళ్లిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశాలనూ కొట్టి పారేయలేం.
ఒకవేళ యంగ్ బంగార్రాజుగా చైతూ కనిపించేట్లయితే.. నాగ్ లాగా ఆ పాత్రలో చైతూ హుషారుగా, రొమాంటిగ్గా, కొంటెగా నటించి మెప్పించగలడా అన్నది డౌటు. ఏదైమైనా నాలుగైదేళ్లు కష్టపడి తీర్చిదిద్దిన స్క్రిప్టులో ఏదో విశేషం ఉండే ఉంటుందని.. సోగ్గాడే చిన్నినాయనా తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…