మొత్తానికి చాలా ఏళ్ల విరామం తర్వాత అక్కినేని తండ్రీ కొడుకులు కలిసి నటించబోతున్నారు. ఇంతకుముందు మనం లాంటి మరపురాని సినిమా కోసం జత కట్టిన నాగార్జున, నాగచైతన్య.. ఈసారి బంగార్రాజు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తండ్రీ కొడుకులు చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా.. పైగా సొంత బేనర్లో తెరకెక్కుతుండటం.. అందులోనూ సోగ్గాడే చిన్నినాయనా లాంటి బ్లాక్బస్టర్ మూవీకి ప్రీక్వెల్ కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఐతే ఈ చిత్రంలో చైతూ పాత్ర ఏంటి అన్న విషయంలో అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన సందర్భంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు నాగార్జున. ఇందులో నాగార్జున, నాగచైతన్యల పేర్లను వేసి.. కింద ఇన్ అండ్ యాజ్ బంగార్రాజు అంటూ టైటిల్ వేశారు.
అంటే తండ్రీ కొడుకులిద్దరూ బంగార్రాజు పాత్రనే చేస్తున్నారా.. యుక్త వయసులో బంగార్రాజుగా చైతూ కనిపించి.. వయసు మళ్లాక నాగార్జున ఆ పాత్రలో దర్శనమిస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అదే నిజమైతే.. నాగ్-చైతూ సినిమాలో కలిసి కనిపించే అవకాశం లేనట్లే. అలా కాకుండా వీళ్లిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించే అవకాశాలనూ కొట్టి పారేయలేం.
ఒకవేళ యంగ్ బంగార్రాజుగా చైతూ కనిపించేట్లయితే.. నాగ్ లాగా ఆ పాత్రలో చైతూ హుషారుగా, రొమాంటిగ్గా, కొంటెగా నటించి మెప్పించగలడా అన్నది డౌటు. ఏదైమైనా నాలుగైదేళ్లు కష్టపడి తీర్చిదిద్దిన స్క్రిప్టులో ఏదో విశేషం ఉండే ఉంటుందని.. సోగ్గాడే చిన్నినాయనా తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.
This post was last modified on August 26, 2021 10:59 am
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…