కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న బాలీవుడ్కు ఓటీటీ ఫ్లాట్ఫామ్లే అంతో ఇంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. థియేటర్లలో వసూళ్ల మీద పూర్తిగా ఆశలు పోయాయి బాలీవుడ్కు. వెండితెరల్లో ఎప్పటికి వెలుగులు నిండుతాయో.. తమ సినిమాలకు మునుపట్లా ఎప్పటికి వసూళ్లు వస్తాయో వారికి అంతు బట్టడం లేదు. తాజాగా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ వసూళ్లు చూసి బాలీవుడ్ బెంబేలెత్తిపోతోంది. సాధారణంగా అక్షయ్ సినిమాలకు తొలి రోజు వచ్చే వసూళ్లు కూడా ఈ చిత్రానికి ఫుల్ రన్లో రావట్లేదు.
ఐతే ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్న కొన్ని హిందీ చిత్రాలకు మాత్రం మంచి స్పందనే వస్తోంది. ఈ మధ్య ‘మిమి’ నెట్ ఫ్లిక్స్లో రిలీజై చాలా మంచి స్పందన రాబట్టుకుంది. దాని తర్వాత వచ్చిన ‘షేర్షా’కు సైతం రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు.
రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్లే కాక వివిధ రంగాల వాళ్లు ‘షేర్షా’ చూసి ఎగ్జైట్ అవుతున్నారు. సైనికాధికారులు కూడా ఈ సినిమా చాలా బాగా తీశారని ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో పెద్ద వ్యక్తి నుంచి ‘షేర్షా’కు ప్రశంసలు లభించాయి. ఆ వ్యక్తి సినిమా వాడే. తమిళ లెజెండరీ యాక్టర్, ఫిలిం మేకర్ కమల్ హాసన్ ‘షేర్షా’ను తెగ పొగిడేశారు. ఒక సినిమా అభిమానిగా.. ఒక దేశభక్తుడి కొడుకుగా సాధారణంగా సినిమాల్లో సైనికులను చూపించే తీరు తనకు అస్సలు నచ్చదని.. కానీ ‘షేర్షా’ మాత్రం అందుకు మినహాయింపు అంటూ కమల్ పొగిడేశారు. ఈ సినిమా చూసి తన ఛాతీ విచ్చుకుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సినిమా తీయడానికి దర్శకుడు విష్ణువర్ధన్కు మద్దతుగా నిలిచిన ధర్మ మూవీస్ సంస్థకు కమల్ అభినందనలు తెలిపారు. చిత్ర హీరో హీరోయిన్ సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలను కూడా ఆయన ప్రశంసించారు. తమిళుడైన విష్ణు ఈ సినిమా తీయడం వల్లే కమల్ ఇంతగా ఎగ్జైట్ అవుతున్నాడనిపిస్తోంది. అయినా సరే.. అంతటి లెజెండ్ ఈ సినిమాను ఇంతగా పొగడ్డం చిత్ర బృందానికి ఎంతో ఆనందాన్నిచ్చే విషయమే.
This post was last modified on August 24, 2021 6:18 pm
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…
అదేంటో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ పదే పదే నోరు జారే తప్పులు చేస్తూనే ఉన్నారు. రాబిన్ హుడ్ టైంలో ఆస్ట్రేలియా…