Movie News

చరణ్ కథతో ‘కేజీఎఫ్’ స్టార్..!

కన్నడ హీరో యష్ కు ‘కేజీఎఫ్’ సినిమా భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా మంది దర్శకులు యష్ తో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా యష్ కోసం ఓ కథ అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత బోయపాటి-యష్ ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని సమాచారం. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా కథేం రాయడం లేదు.

ఇప్పటికే తన దగ్గరున్న కథను యష్ కి తగ్గట్లుగా మార్చబోతున్నారట. బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో ‘వినయ విధేయ రామ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ అయింది. నిజానికి ఈ కథ కంటే ముందు చరణ్ కి మరో కథ చెప్పారట బోయపాటి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మరింత ఎక్కువగా ఉండడంతో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ కథను ఎంపిక చేసుకున్నారు. కానీ చరణ్ అంచనా తప్పింది. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ బోయపాటి చెప్పిన మరో కథతో చరణ్ సినిమా చేద్దామనుకున్నారు.

అదే విషయాన్ని బోయపాటికి కూడా పలు సార్లు చెప్పారట. కానీ ప్రస్తుతం చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా.. ఇప్పట్లో బోయపాటితో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే బోయపాటి తన దగ్గర ఉన్న కథను యష్ కి అనుగుణంగా మార్చుతున్నారని సమాచారం. యష్ కి కూడా తెలుగులో నేరుగా సినిమా చేయాలనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు బోయపాటితో సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!

This post was last modified on August 24, 2021 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago