Movie News

చరణ్ కథతో ‘కేజీఎఫ్’ స్టార్..!

కన్నడ హీరో యష్ కు ‘కేజీఎఫ్’ సినిమా భారీ క్రేజ్ ను తీసుకొచ్చింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చాలా మంది దర్శకులు యష్ తో కలిసి సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా యష్ కోసం ఓ కథ అనుకుంటున్నారు. ‘అఖండ’ సినిమా తరువాత బోయపాటి-యష్ ల మధ్య సిట్టింగులు జరగబోతున్నాయని సమాచారం. అయితే యష్ కోసం బోయపాటి కొత్తగా కథేం రాయడం లేదు.

ఇప్పటికే తన దగ్గరున్న కథను యష్ కి తగ్గట్లుగా మార్చబోతున్నారట. బోయపాటి-రామ్ చరణ్ కాంబినేషన్ లో గతంలో ‘వినయ విధేయ రామ’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది డిజాస్టర్ అయింది. నిజానికి ఈ కథ కంటే ముందు చరణ్ కి మరో కథ చెప్పారట బోయపాటి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మరింత ఎక్కువగా ఉండడంతో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ కథను ఎంపిక చేసుకున్నారు. కానీ చరణ్ అంచనా తప్పింది. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ బోయపాటి చెప్పిన మరో కథతో చరణ్ సినిమా చేద్దామనుకున్నారు.

అదే విషయాన్ని బోయపాటికి కూడా పలు సార్లు చెప్పారట. కానీ ప్రస్తుతం చరణ్ ఉన్న బిజీ షెడ్యూల్స్ కారణంగా.. ఇప్పట్లో బోయపాటితో సినిమా చేసే ఛాన్స్ కనిపించడం లేదు. అందుకే బోయపాటి తన దగ్గర ఉన్న కథను యష్ కి అనుగుణంగా మార్చుతున్నారని సమాచారం. యష్ కి కూడా తెలుగులో నేరుగా సినిమా చేయాలనుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా అనుకున్నారు కానీ సెట్ కాలేదు. ఇప్పుడు బోయపాటితో సినిమా వర్కవుట్ అవుతుందేమో చూడాలి!

This post was last modified on August 24, 2021 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

46 minutes ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

2 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

2 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

4 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

4 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

5 hours ago