యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ను ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ కెరీర్ ఆరంభం నుంచి ఎలా పుష్ చేస్తున్నారో తెలిసిందే. నటన పరంగా మొదట్నుంచి శ్రీనివాస్ తడబడుతూనే ఉన్నప్పటికీ.. అతడికి పెద్ద పెద్ద దర్శకులతో భారీ సినిమాలు చేసే అవకాశం దక్కింది. టాలీవుడ్ బడా స్టార్ల సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో అతడి సినిమాలపై బడ్జెట్లు పెడుతుంటారు. కాస్ట్ అండ్ క్రూ అంతా టాప్ లెవెల్లో ఉంటుంది. తెలుగులో హీరోగా ఇంకా సరిగా నిలదొక్కుకోకపోయినా అప్పుడే బాలీవుడ్లో కూడా అడుగు పెట్టేస్తున్నాడు శ్రీనివాస్. అతను హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
శ్రీనివాస్ సంగతలా ఉంచితే.. ఆల్రెడీ అతడి తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ప్రేమ కాదల్ ఇష్క్, సావిత్రి చిత్రాల దర్శకుడు పవన్ సాధినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రం హిందీ మూవీ ‘వివాహ్’కు రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. కరోనా, ఇతర కారణాల వల్ల ఈ సినిమా కొంచెం ఆలస్యం అవుతోంది. ఐతే ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే గణేష్ హీరోగా ఓ కొత్త సినిమా మొదలైపోయింది.
‘నాంది’తో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సతీష్ వర్మ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇదొక కొత్త తరహా థ్రిల్లర్ మూవీ అట. సోమవారమే హైదరాబాద్లో ఈ చిత్రానికి ప్రారంభోత్సవం జరిపారు. దిల్ రాజు, అల్లరి నరేష్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు. దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణచైతన్య మళ్లీ ఈ సినిమాకు పాటలు రాస్తుండటం విశేషం. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. తక్కువ బడ్జెట్లో, వేగంగా ఈ సినిమా పూర్తి చేయడానికి ప్లాన్ చేసిందట చిత్ర బృందం.
This post was last modified on August 23, 2021 3:16 pm
టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…
వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…
రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియనుంది. మూడు రోజుల పర్యటనలో…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…