ఓటీటీల జోరు బాగా పెరిగిన గత రెండేళ్లలో వివిధ భాషల వాళ్లకు మలయాళ సినిమాల సత్తా ఏంటో బాగా తెలిసింది. అక్కడి నటీనటుల ప్రతిభ కూడా అందరికీ అర్థమవుతోంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించిన మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్. కుంబలంగి నైట్స్, ట్రాన్స్, జోజి, మాలిక్ లాంటి సినిమాలు అతడి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసేలా చేశాయి.
అలాంటి గొప్ప నటుడు తెలుగులోకి అడుగు పెడుతుండటం మన ప్రేక్షకులను బాగా ఎగ్జైట్ చేస్తోంది. అందులోనూ ఆ చిత్రం అల్లు అర్జున్-సుకుమార్ల కలయికలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ కావడంతో ఆసక్తి రెట్టింపు అవుతోంది. మలయాళంలో కొన్ని కొన్ని చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఫాహద్ అదరగొట్టేశాడు. కళ్లతోనే భయం పుట్టించడం, శాడిజం చూపించడంలో ఫాహద్ ప్రత్యేకతే వేరు. విలన్ పాత్రలను చాలా బలంగా తీర్చిదిద్దే సుకుమార్ అతడి కోసం అదిరిపోయే పాత్రే సిద్ధం చేసి ఉంటాడన్న అంచనాలతో ప్రేక్షకులు ఉన్నారు.
అలాగే హీరో, విలన్ పాత్రలకు తనదైన శైలిలో మేకోవర్ ఇచ్చే అలవాటు ఉన్న సుకుమార్.. ఫాహద్ పాత్రను ఎలా ప్రెజెంట్ చేస్తాడో అన్న ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఫాహద్ ఇందులో స్టన్నింగ్ లుక్లో కనిపించనున్నాడట. అతను గుండుతో కనిపిస్తాడని తెలిసింది. మేకప్ చాలా బాగా కుదిరిందని.. ఇందులో ఫాహద్ను చూడగానే ప్రేక్షకులు స్టన్నవుతారని అంటున్నారు. ఫాహద్ చేస్తున్నది ఐపీఎస్ అధికారి పాత్ర అన్న సంగతి ఇప్పటికే రివీలైంది. ఐతే స్వతహాగా ఉత్తరాది వ్యక్తి అయినప్పటికీ.. ఏపీలోని చిత్తూరు జిల్లాలో పని చేసే అధికారిగా ఫాహద్ కనిపించనున్నాడట.
గత నెలలో ఒకసారి హైదరాబాద్కు వచ్చి లుక్ టెస్ట్ చేయించుకుని వెళ్లిన ఫాహద్.. రెండు రోజుల కిందటే షూటింగ్ కోసం తిరిగొచ్చాడు. అతడి మీద సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందిప్పుడు. ఫస్ట్ పార్ట్లో ఫాహద్ పాత్ర తక్కువ సన్నివేశాల్లోనే కనిపిస్తుందని.. ఆ పాత్ర సెకండ్ పార్ట్లో బన్నీ క్యారెక్టర్తో ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
This post was last modified on August 23, 2021 3:11 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…