కరోనా మహమ్మారి వచ్చాక బాలీవుడ్ వాళ్ల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఏడాదిన్నరకు పైగా థియేటర్ల నుంచి పూర్తిగా ఆదాయం ఆగిపోయింది హిందీ చిత్రాలకు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్కు మధ్యలో దొరికిన విరామాన్ని బాలీవుడ్ ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. హిందీ సినిమాల మార్కెట్ ఉన్న రాష్ట్రాల్లో థియేటర్లు చాలా వరకు మూతపడే ఉన్నాయి. తెరుచుకున్న చోట్ల కూడా సినిమాలకు కనీస స్థాయిలో ఆదరణ లేదు. సెకండ్ వేవ్ తర్వాత అయినా కాస్త పుంజుకుంటామని ఆశిస్తే.. బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాలు తప్పట్లేదు.
థియేటర్లు పూర్తిగా తెరుచుకోకున్నప్పటికీ నెమ్మదిగా పరిస్థితులు బాగుపడతాయన్న ఆశతో ఓ స్టార్ హీరో సినిమాను నాలుగు రోజుల కిందట థియేటర్లలోకి వదిలారు. అదే.. బెల్బాటమ్. అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన సినిమా ఇది. సినిమాకు మంచి బజ్ కూడా కనిపించింది. ఈ సినిమాతో బాలీవుడ్ రివైవల్ మొదలవుతుందని ఆశించారు.
కానీ హిందీ చిత్ర పరిశ్రమను మరింత కంగారెత్తించే ఫలితాన్ని అందుకుంటోంది బెల్ బాటమ్. అక్షయ్ కుమార్ సినిమాకు ఓపెనింగ్ డే ఇండియాలో రూ.20 కోట్లు వచ్చేవి ఒకప్పుడు. అందులో నాలుగో వంతు కూడా వసూలు కాలేదు రిలీజ్ రోజైన గురువారం. మూడు కోట్ల లోపు నెట్ వసూళ్లకు పరిమితం అయిన ఈ చిత్రం తర్వాతి రోజుల్లో అయినా పుంజుకుంటుందేమో అనుకుంటే అలా ఏమీ జరగలేదు. శనివారం నాటికి మొత్తం ఇండియా వసూళ్లు కేవలం రూ.8.5 కోట్లు మాత్రమే. ఆదివారం కూడా మహా అయితే వసూళ్లు రూ.3 కోట్లుంటాయేమో. ఫుల్ రన్లో రూ.15 కోట్లకు మించి ఈ చిత్రం వసూలు చేసేలా కనిపించడం లేదు.
ఒక్క రోజులో వచ్చే వసూళ్లు ఫుల్ రన్లో కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. బెల్ బాటమ్కు ఆశాజనక ఫలితం వస్తే మరిన్ని కొత్త చిత్రాలను రిలీజ్ చేద్దామని ఆశించిన బాలీవుడ్ ఫిలిం మేకర్లకు ఇది శరాఘాతం లాంటి ఫలితమే. చూస్తుంటే ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలేవీ రిలీజయ్యేలా లేవు. మరిన్ని చిత్రాలు ఓటీటీ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…