Movie News

ర‌వితేజ‌ను న‌మ్మి అంత పెట్టేశారా?


మాస్ రాజా ర‌వితేజ టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్ల‌లో ఒక‌డు. అత‌డి సినిమాల‌కు ప్ర‌స్తుతం రూ.50 కోట్ల‌కు పైగానే బిజినెస్ జ‌రుగుతోంది. మాస్ రాజా సినిమాల మీద రూ.30-35 కోట్ల మ‌ధ్య బ‌డ్జెట్ పెడితే నిర్మాత‌లు మంచి లాభాలే అందుకునే అవ‌కాశం ఉంది. మ‌ధ్య‌లో వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ చివ‌ర‌గా ర‌వితేజ నుంచి వ‌చ్చిన క్రాక్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్నే అందుకుంది. రూ.35 కోట్ల‌కు పైగానే షేర్ రాబ‌ట్టింది. మిగ‌తా ఆదాయం కూడా క‌లుపుకుంటే రూ.50 కోట్లకు పైగానే ఆదాయం వ‌చ్చిన‌ట్లు.

ఐతే దీని త‌ర్వాత ర‌వితేజ న‌టిస్తున్న సినిమా మీద ఏకంగా రూ.65 కోట్ల బ‌డ్జెట్ పెట్టేస్తున్నారంటే షాక‌వ్వాల్సిందే. ఇదేమీ రూమ‌ర్ కూడా కాదు. స్వ‌యంగా ఆ చిత్ర ద‌ర్శ‌కుడు వెల్ల‌డించిన విష‌య‌మే. ఆ చిత్రం ఖిలాడి కాగా.. దీనికి రూ.65 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్లు చెప్పింది దాని ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌నే. త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ర‌మేష్‌.. ఖిలాడి ర‌వితేజ కెరీర్లోనే అత్య‌ధిక బ‌డ్జెట్లో తెర‌కెక్కిన చిత్ర‌మ‌ని.. దీనిపై రూ.65 కోట్లు ఖ‌ర్చు పెడుతున్నామ‌ని వెల్ల‌డించాడు.

ఐతే ఇప్ప‌టిదాకా ర‌వితేజ కెరీర్లో అతి పెద్ద హిట్ అనుకుంటున్న క్రాక్‌కే ఆదాయం రూ.60 కోట్లు కూడా రాన‌పుడు ఖిలాడి మీద రూ.65 కోట్లు ఎలా పెట్టేస్తార‌న్న‌ది ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. క్రాక్ కంటే ముందు మాస్ రాజా నుంచి వ‌చ్చిన డిస్కో రాజాకు వ‌చ్చిన షేర్ రూ.10 కోట్లు కూడా లేదు. దాని మీద రూ.30 కోట్లు పెడితేనే నిర్మాత దారుణంగా న‌ష్ట‌పోయాడు. మ‌రి ఖిలాడి అటు ఇటు అయితే దీని నిర్మాత కోనేరు స‌త్య‌నారాయ‌ణ ప‌రిస్థితేంటి? మ‌రి నిజంగా ఈ చిత్రం మీద రూ.65 కోట్లు పెట్టి ఉంటారా.. లేక హైప్ కోసం ఎక్కువ చేసి చెబుతున్నారా అన్న‌ది డౌటు.

Satya

Recent Posts

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

1 hour ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

4 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

10 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

12 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

12 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

13 hours ago