ఈ ఏడాది ‘నాంది’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ సహా కొందరు పేరున్న దర్శకుల దగ్గర పని చేసిన విజయ్.. తన గురువు హరీష్ లాగా దర్శకత్వ అరంగేట్రానికి ఎంటర్టైనర్ను ఎంచుకోకుండా.. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.
ఎన్నో ఏళ్లుగా హిట్టు రుచే తెలియని అల్లరి నరేష్కు అత్యావశ్యకమైన విజయాన్ని అందించడమే కాదు.. తన కెరీర్కూ మంచి పునాది వేసుకున్నాడు. ఐతే రెండో సినిమా విషయంలో విజయ్ హడావుడి పడిపోలేదు. ఆచితూచి తర్వాతి సినిమాను ఎంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అతను అక్కినేని నాగచైతన్యతో తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి అతను ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి చిత్రాలతో ఊపుమీదున్న షైన్ స్క్ర్రీన్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన హడావుడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక చైతూ-విజయ్ సినిమాను ప్రకటించే అవకాశముంది.
చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘థ్యాంక్ యు’ చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాడు. అందులో తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ కనకమేడల సినిమాలో ఈ అక్కినేని హీరో నటించే అవకాశముంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…