ఈ ఏడాది ‘నాంది’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ సహా కొందరు పేరున్న దర్శకుల దగ్గర పని చేసిన విజయ్.. తన గురువు హరీష్ లాగా దర్శకత్వ అరంగేట్రానికి ఎంటర్టైనర్ను ఎంచుకోకుండా.. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.
ఎన్నో ఏళ్లుగా హిట్టు రుచే తెలియని అల్లరి నరేష్కు అత్యావశ్యకమైన విజయాన్ని అందించడమే కాదు.. తన కెరీర్కూ మంచి పునాది వేసుకున్నాడు. ఐతే రెండో సినిమా విషయంలో విజయ్ హడావుడి పడిపోలేదు. ఆచితూచి తర్వాతి సినిమాను ఎంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అతను అక్కినేని నాగచైతన్యతో తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి అతను ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి చిత్రాలతో ఊపుమీదున్న షైన్ స్క్ర్రీన్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన హడావుడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక చైతూ-విజయ్ సినిమాను ప్రకటించే అవకాశముంది.
చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘థ్యాంక్ యు’ చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాడు. అందులో తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ కనకమేడల సినిమాలో ఈ అక్కినేని హీరో నటించే అవకాశముంది.
This post was last modified on August 22, 2021 3:28 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…