ఈ ఏడాది ‘నాంది’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ సహా కొందరు పేరున్న దర్శకుల దగ్గర పని చేసిన విజయ్.. తన గురువు హరీష్ లాగా దర్శకత్వ అరంగేట్రానికి ఎంటర్టైనర్ను ఎంచుకోకుండా.. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.
ఎన్నో ఏళ్లుగా హిట్టు రుచే తెలియని అల్లరి నరేష్కు అత్యావశ్యకమైన విజయాన్ని అందించడమే కాదు.. తన కెరీర్కూ మంచి పునాది వేసుకున్నాడు. ఐతే రెండో సినిమా విషయంలో విజయ్ హడావుడి పడిపోలేదు. ఆచితూచి తర్వాతి సినిమాను ఎంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అతను అక్కినేని నాగచైతన్యతో తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి అతను ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి చిత్రాలతో ఊపుమీదున్న షైన్ స్క్ర్రీన్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన హడావుడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక చైతూ-విజయ్ సినిమాను ప్రకటించే అవకాశముంది.
చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘థ్యాంక్ యు’ చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాడు. అందులో తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ కనకమేడల సినిమాలో ఈ అక్కినేని హీరో నటించే అవకాశముంది.
This post was last modified on August 22, 2021 3:28 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…