ఈ ఏడాది ‘నాంది’ సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు యువ దర్శకుడు విజయ్ కనకమేడల. హరీష్ శంకర్ సహా కొందరు పేరున్న దర్శకుల దగ్గర పని చేసిన విజయ్.. తన గురువు హరీష్ లాగా దర్శకత్వ అరంగేట్రానికి ఎంటర్టైనర్ను ఎంచుకోకుండా.. ‘నాంది’ లాంటి సీరియస్ సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు.
ఎన్నో ఏళ్లుగా హిట్టు రుచే తెలియని అల్లరి నరేష్కు అత్యావశ్యకమైన విజయాన్ని అందించడమే కాదు.. తన కెరీర్కూ మంచి పునాది వేసుకున్నాడు. ఐతే రెండో సినిమా విషయంలో విజయ్ హడావుడి పడిపోలేదు. ఆచితూచి తర్వాతి సినిమాను ఎంచుకున్నాడు.
తాజా సమాచారం ప్రకారం అతను అక్కినేని నాగచైతన్యతో తన రెండో సినిమా చేయబోతున్నాడట. ఈసారి అతను ఓ థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాంటి చిత్రాలతో ఊపుమీదున్న షైన్ స్క్ర్రీన్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుందట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.
ప్రస్తుతం షైన్ స్క్రీన్స్ అధినేతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి.. ‘టక్ జగదీష్’ ఓటీటీ విడుదలకు సంబంధించిన హడావుడిలో ఉన్నారు. ఆ చిత్రం రిలీజయ్యాక చైతూ-విజయ్ సినిమాను ప్రకటించే అవకాశముంది.
చైతూ నటించిన ‘లవ్ స్టోరి’ సెప్టెంబరు 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరోవైపు ‘మనం’ దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ నటిస్తున్న ‘థ్యాంక్ యు’ చివరి దశలో ఉంది. బాలీవుడ్ మూవీ ‘లాల్ సింగ్ చద్దా’లో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తి చేసిన చైతూ.. ఇటీవలే ‘బంగార్రాజు’ను మొదలుపెట్టాడు. అందులో తండ్రి నాగార్జునతో కలిసి చైతూ నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక విజయ్ కనకమేడల సినిమాలో ఈ అక్కినేని హీరో నటించే అవకాశముంది.
This post was last modified on August 22, 2021 3:28 pm
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…