గత ఆరేడేళ్లలో తెలుగు సినిమాలకు బంగారు బాతులా మారింది యుఎస్ మార్కెట్. అక్కడ ఇండియాలో మిగతా అన్ని భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.200 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయంటే మన సినిమాలకు అక్కడున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నీ బాహుబలి స్థాయికి వెళ్లకపోయినా.. మన బడా స్టార్ల సినిమాలకు రూ.25-30 కోట్ల మేర హక్కులు పలికే రేంజికి మార్కెట్ ఎగబాకింది. ఐతే కరోనా దెబ్బకు ఈ మార్కెట్ అంతా గల్లంతయిపోయింది.
వైరస్ దెబ్బకు ఇక్కడ లాగే అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. నెమ్మదిగి థియేటర్లు పునఃప్రారంభం అయినా సరే.. ముందులా సందడి కనిపించట్లేదు. ఎన్నారై ప్రేక్షకులు మునుపట్లా థియేటర్లకు పెద్ద ఎత్తున రావట్లేదు. బాగా ఓటీటీలకు అలవాటు పడిపోవడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు. యుఎస్లో టికెట్ల రేట్లు బాగా ఎక్కువ. ఒక సినిమా చూసే రేటుతో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షనే వచ్చేస్తోంది. పైగా కొత్త సినిమాలు చాలానే ఓటీటీలో రిలీజవుతున్నాయి. వీటికి అలవాటు పడి కొత్త సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెట్టే రోజులు పోయాయి.
అందులోనూ స్టార్ల సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడం మైనస్ అయింది. దీంతో తెలుగు ఎన్నారైల సినిమా కల్చరే మారిపోయి తెలుగు చిత్రాల యుఎస్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఒకప్పట్లా భారీ చిత్రాలు వచ్చాక పరిస్థితులు నెమ్మదిగా మెరుగు పడొచ్చేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పుడు కొత్త ప్రిమియర్స్ పడటమే గగనంగా ఉండగా.. ఒకవేళ అవి ప్లాన్ చేసినా ఓపెనింగ్స్ నామమాత్రంగా ఉంటున్నాయి. రాజ రాజ చోర చిత్రానికి మంచి టాక్ వచ్చినా వీకెండ్లో లక్ష డాలర్లు కూడా వసూలయ్యే పరిస్థితి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on August 22, 2021 6:11 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…