గత ఆరేడేళ్లలో తెలుగు సినిమాలకు బంగారు బాతులా మారింది యుఎస్ మార్కెట్. అక్కడ ఇండియాలో మిగతా అన్ని భాషా చిత్రాల కంటే తెలుగు సినిమాలకు ఎక్కువ వసూళ్లు వస్తుంటాయి. బాహుబలి రెండు భాగాలకు కలిపి రూ.200 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయంటే మన సినిమాలకు అక్కడున్న మార్కెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అన్నీ బాహుబలి స్థాయికి వెళ్లకపోయినా.. మన బడా స్టార్ల సినిమాలకు రూ.25-30 కోట్ల మేర హక్కులు పలికే రేంజికి మార్కెట్ ఎగబాకింది. ఐతే కరోనా దెబ్బకు ఈ మార్కెట్ అంతా గల్లంతయిపోయింది.
వైరస్ దెబ్బకు ఇక్కడ లాగే అక్కడా థియేటర్లు మూతపడ్డాయి. మళ్లీ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. నెమ్మదిగి థియేటర్లు పునఃప్రారంభం అయినా సరే.. ముందులా సందడి కనిపించట్లేదు. ఎన్నారై ప్రేక్షకులు మునుపట్లా థియేటర్లకు పెద్ద ఎత్తున రావట్లేదు. బాగా ఓటీటీలకు అలవాటు పడిపోవడం కూడా అందుకు ఓ కారణం కావచ్చు. యుఎస్లో టికెట్ల రేట్లు బాగా ఎక్కువ. ఒక సినిమా చూసే రేటుతో ఒక ఓటీటీ సబ్స్క్రిప్షనే వచ్చేస్తోంది. పైగా కొత్త సినిమాలు చాలానే ఓటీటీలో రిలీజవుతున్నాయి. వీటికి అలవాటు పడి కొత్త సినిమాల కోసం థియేటర్లకు పరుగులు పెట్టే రోజులు పోయాయి.
అందులోనూ స్టార్ల సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడం మైనస్ అయింది. దీంతో తెలుగు ఎన్నారైల సినిమా కల్చరే మారిపోయి తెలుగు చిత్రాల యుఎస్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఒకప్పట్లా భారీ చిత్రాలు వచ్చాక పరిస్థితులు నెమ్మదిగా మెరుగు పడొచ్చేమో కానీ.. ఇప్పుడు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఇప్పుడు కొత్త ప్రిమియర్స్ పడటమే గగనంగా ఉండగా.. ఒకవేళ అవి ప్లాన్ చేసినా ఓపెనింగ్స్ నామమాత్రంగా ఉంటున్నాయి. రాజ రాజ చోర చిత్రానికి మంచి టాక్ వచ్చినా వీకెండ్లో లక్ష డాలర్లు కూడా వసూలయ్యే పరిస్థితి లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on August 22, 2021 6:11 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…