బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. గత పదేళ్లలో చేసిన సినిమాల జాబితా తీస్తే ‘భజరంగి భాయిజాన్’, ‘సుల్తాన్’ మినహాయిస్తే అన్నీ చాలా సాధారణంగానే కనిపిస్తాయి. అందులోనూ ‘రాధె’ లాంటి కొన్ని చిత్రాలైతే మరీ నాసిరకం. చాలా సల్మాన్ సినిమాలకు కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు. ఓపెనింగ్స్ మోత మోగిపోయి ఉండొచ్చు. కానీ ఆయా సినిమాలను చూసి ప్రేక్షకుల్లో చాలా వరకు పెదవి విరిచిన వాళ్లే. ‘రాధె’ సినిమా చూసైతే అభిమానులే మండిపడ్డారు. సల్మాన్ మారాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు.
ఐతే అలాంటి టైంలోనే తమిళంలో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ‘మాస్టర్’ మూవీని సల్మాన్ రీమేక్ చేస్తున్నాడని ప్రకటన రాగానే ఉస్సూరుమన్నారు. అమేజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని హిందీ ప్రేక్షకులు కూడా బాగానే చూసి ఉంటారు. అందులో ఏముందని సల్మాన్ రీమేక్ చేస్తున్నాడనే సందేహాలు తలెత్తాయి వారికి. స్వయంగా సల్మానే ‘మాస్టర్’ రీమేక్ హక్కులు కొన్నట్లు వార్తలొచ్చాయి.
ఐతే ఇప్పుడు ఏమైందో ఏమో సల్మాన్ మనసు మార్చుకున్నాడట. ‘మాస్టర్’ రీమేక్లో నటించొద్దని నిర్ణయం తీసుకున్నాడట. ఈ ప్రాజెక్టును సల్మాన్ క్యాన్సిల్ చేసేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఐతే ఈ కబురు విని సల్మాన్ అభిమానులు సహా అందరూ సంతోషిస్తున్నారు. అతడికి జ్ఞానోదయం అయిందని.. ఇలాంటి రొటీన్ చిత్రాలకు దూరంగా ఉంటే మంచిదని అంటున్నారు. దీని బదులే సల్మాన్ అటవీ నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాని బడ్జెట్ రూ.300 కోట్లని అంటున్నారు.
ఐతే ‘మాస్టర్’ రీమేక్ హక్కులను స్వయంగా సల్మానే కొన్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో వాటినే వేరే వాళ్లకు ఇచ్చేస్తున్నాడా లేక ఈ అగ్రిమెంట్నే క్యాన్సిల్ చేస్తున్నాడా అన్నది తెలియదు. సల్మాన్ చేయలేదంటే బహుశా హిందీలో ఈ చిత్రం పునర్నిర్మితం అయ్యే అవకాశాలు లేనట్లే. ఐతే తమిళం, తెలుగు భాషల్లో డివైడ్ టాక్ను తట్టుకునే ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకోవడం విశేషం.
This post was last modified on August 18, 2021 2:23 pm
పశ్చిమ బెంగాల్లో సుదీర్ఘకాలం పాటు పాలన సాగించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం…
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…