టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఈ మధ్య రీమేక్ మోజు పట్టుకున్నట్లు ఉంది. ఈ మధ్యే ఆయన తమిళ క్లాసిక్ ‘96’ను పట్టుబట్టి రీమేక్ చేయించారు. ‘జాను’ పేరుతో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగులో దారుణమైన ఫలితాన్నందుకుంది. అయినా రాజు వెనక్కి తగ్గట్లేదు.
తెలుగులో గొప్ప సినిమాగా పేరు తెచ్చుకున్న ‘జెర్సీ’ రీమేక్ హక్కులు కొని.. హిందీలో కరణ్ జోహార్తో కలిసి అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ఆ చిత్రానికి హిందీలోనూ గౌతమ్ తిన్ననూరినే రూపొందిస్తున్నాడు. మంచి ఎమోషన్ ఉన్న కథ, దేశవ్యాప్తంగా అందరికీ కనెక్టయ్యే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో షాహిద్ నటించిన ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్) తరహాలోనే ఇది కూడా హిందీలో మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు రాజు తన బేనర్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్-2’ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా ఆయన మరో తెలుగు సినిమాను హిందీలోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ చిత్రం మరేదో కాదు.. హిట్. నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా కొత్త దర్శకుడు శైలేష్ కొలను రూపొందించిన ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అన్ సీజన్లో రావడం వల్ల వసూళ్లు మరీ ఎక్కువ రాలేదు కానీ.. సినిమా మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందింది. అమేజాన్ ప్రైంలో ఈ సినిమాను జనాలు బాగా చూశారు.
హిందీ అర్బన్ ఆడియన్స్కు బాగా కనెక్టయ్యే అవకాశమున్న ఈ థ్రిల్లర్ మూవీని హిందీలో మరింత పకడ్బందీగా తీస్తే మంచి ఫలితాన్నందుకునే అవకాశముంది. నాని నుంచి హక్కులు తీసుకున్న రాజు.. బాలీవుడ్లో కొత్తగా ఏర్పడిన పరిచయాల్ని అనుసరించి చర్చలు జరుపుతున్నాడని.. త్వరలోనే ఈ రీమేక్ గురించి కూడా ప్రకటన రావచ్చని అంటున్నారు.
This post was last modified on May 27, 2020 2:51 pm
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…