Movie News

అన్నపూర్ణ స్టూడియోస్.. అనుభవించు రాజా


టాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న బడా బేనర్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు 80వ దశకంలోనే ఈ సంస్థను మొదలుపెట్టి పదుల సంఖ్యలో ఈ బేనర్లో సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున దీని బాధ్యతలు తీసుకున్నారు. తాను హీరోగా చాలా సినిమాలే చేశాడీ సంస్థలో. అంతే కాక కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ చిన్న చిన్న చిత్రాలూ నిర్మించాడీ బేనర్లో. ఉయ్యాల జంపాల ఆ తరహా చిత్రమే. ఐతే దాని తర్వాత అన్నపూర్ణ బేనర్‌కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి.

చివరగా ఈ బేనర్ నుంచి వచ్చిన ‘రంగుల రాట్నం’ విడుదలైన సంగతి కూడా తెలియనంత దారుణమైన ఫలితాన్నందుకుంది. ఐతే దాని హీరో రాజ్‌ తరుణ్‌ను నమ్మి నాగ్ మరోసారి అవకాశం ఇస్తున్నాడు. రాజ్‌తో ఇంతకుముందు ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

అన్నపూర్ణ బేనర్లో రాజ్-శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రానికి ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. దీన్ని బట్టి ఇది పక్కా ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేసేస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఇందులో రాజ్ సరసన కాషిష్ ఖాన్ అనే కొత్తమ్మాయి నటిస్తోంది.

రాజ్ తరుణ్‌తో పాటు శ్రీనివాస్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం. రాజ్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. గత ఏడాది ఓటీటీలో రిలీజైన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓ మోస్తరుగా ఆడింది. దాన్ని కూడా హిట్ అని చెప్పలేం. దానికి ముందు, తర్వాత దరారుణమైన ఫలితాలందుకున్నాడు రాజ్. ‘ఉయ్యాల జంపాల’తో తన కెరీర్‌కు మంచి ఆరంభాన్నిచ్చిన అన్నపూర్ణ స్టూడియోసే ఇప్పుడు తన కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పుతుందని అతను ఆశిస్తున్నాడు.

This post was last modified on August 16, 2021 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’

తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. విజయ్ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్…

3 hours ago

ఫౌజీకి ప్రాణం… చివరి ఘట్టం

రాజా సాబ్ తర్వాత ప్రభాస్ నెక్స్ట్ రిలీజ్ ఫౌజీనే. స్పిరిట్ వచ్చే ఏడాది ఆల్రెడీ లాక్ చేసుకుంది కనక ఈ…

5 hours ago

చెన్నై మ్యాచ్ అవుట్ వివాదం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నితీష్ రాణా అవుటైన తీరు ఇప్పుడు…

5 hours ago

గట్టు మీదున్న ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా

ఎల్లుండి విడుదల కాబోతున్న గోదారి గట్టుపైన సినిమా కోసం హీరో సుమంత్ ప్రభాస్ ఫుల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఒకపక్క ఇంటర్వ్యూలు…

7 hours ago

ఎంత పెద్ద నాయకుడు ఫోన్ చేసినా పట్టించుకోకండి: అనిత

టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత నోట నుంచి వచ్చే మాటలు ఎప్పటికప్పుడు వైరల్…

8 hours ago

జియో ఉంది… పెద్దికి టెన్ష‌న్ లేదు

ఈ రోజుల్లో సినిమా తీయ‌డం కంటే దాన్ని జ‌నాల్లోకి తీసుకెళ్ల‌డం, మంచి రిలీజ్ ఉండేలా చూసుకోవ‌డం స‌వాలుగా మారింది. తెలుగులో…

9 hours ago