Movie News

అన్నపూర్ణ స్టూడియోస్.. అనుభవించు రాజా


టాలీవుడ్లో సుదీర్ఘ చరిత్ర ఉన్న బడా బేనర్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావు 80వ దశకంలోనే ఈ సంస్థను మొదలుపెట్టి పదుల సంఖ్యలో ఈ బేనర్లో సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు అక్కినేని నాగార్జున దీని బాధ్యతలు తీసుకున్నారు. తాను హీరోగా చాలా సినిమాలే చేశాడీ సంస్థలో. అంతే కాక కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ చిన్న చిన్న చిత్రాలూ నిర్మించాడీ బేనర్లో. ఉయ్యాల జంపాల ఆ తరహా చిత్రమే. ఐతే దాని తర్వాత అన్నపూర్ణ బేనర్‌కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి.

చివరగా ఈ బేనర్ నుంచి వచ్చిన ‘రంగుల రాట్నం’ విడుదలైన సంగతి కూడా తెలియనంత దారుణమైన ఫలితాన్నందుకుంది. ఐతే దాని హీరో రాజ్‌ తరుణ్‌ను నమ్మి నాగ్ మరోసారి అవకాశం ఇస్తున్నాడు. రాజ్‌తో ఇంతకుముందు ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా తీసిన శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం విశేషం.

అన్నపూర్ణ బేనర్లో రాజ్-శ్రీనివాస్ కలిసి చేస్తున్న చిత్రానికి ‘అనుభవించు రాజా’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. దీన్ని బట్టి ఇది పక్కా ఎంటర్టైనర్ అనే విషయం అర్థమవుతోంది. చడీచప్పుడు లేకుండా ఈ సినిమాను మొదలుపెట్టి చకచకా పూర్తి చేసేస్తున్నారు. సినిమా ముగింపు దశలో ఉన్నట్లు సమాచారం. ఇందులో రాజ్ సరసన కాషిష్ ఖాన్ అనే కొత్తమ్మాయి నటిస్తోంది.

రాజ్ తరుణ్‌తో పాటు శ్రీనివాస్ కెరీర్‌కు ఈ సినిమా చాలా కీలకం. రాజ్ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా జనాలకు గుర్తు లేదు. గత ఏడాది ఓటీటీలో రిలీజైన ‘ఒరేయ్ బుజ్జిగా’ ఓ మోస్తరుగా ఆడింది. దాన్ని కూడా హిట్ అని చెప్పలేం. దానికి ముందు, తర్వాత దరారుణమైన ఫలితాలందుకున్నాడు రాజ్. ‘ఉయ్యాల జంపాల’తో తన కెరీర్‌కు మంచి ఆరంభాన్నిచ్చిన అన్నపూర్ణ స్టూడియోసే ఇప్పుడు తన కెరీర్‌ను మరోసారి మలుపు తిప్పుతుందని అతను ఆశిస్తున్నాడు.

This post was last modified on August 16, 2021 2:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ నటుడు… వందల కోట్ల అక్షయ పాత్ర

ఇండస్ట్రీలో ఎవరికి ఎక్కడ బ్రేక్ ఎలా రాసి ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఒక బ్లాక్ బస్టర్ జాతకాలనే మార్చేస్తుంది. ఖాళీగా…

12 minutes ago

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే…

2 hours ago

ఫ‌లించిన ప‌వ‌న్ ప్ర‌య‌త్నం.. బ‌డ్జెట్‌లో `కొబ్బ‌రి`కి కీల‌క స్థానం

ఏపీలోని కోన‌సీమ ప్రాంతంలో కొబ్బ‌రి సాగు ఎక్కువ‌. దేశంలో కేర‌ళ త‌ర్వాత‌.. కోన‌సీమ‌లో భారీ ఎత్తున కొబ్బ‌రి సాగు చేస్తున్నారు.…

2 hours ago

వరప్రసాద్ గారు కాస్త ఊపిరినిచ్చారు

సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్ రన్ తో రికార్డులు సృష్టించిన మన శంకరవరప్రసాద్ గారు తర్వాత బాగా స్లో అయిపోయింది.…

3 hours ago

మూడోసారి దొరికిపోయిన మర్దాని

ఏదైనా సూపర్ హిట్ ఫ్రాంచైజ్ కి కొనసాగింపు చేయడం అంత సులభం కాదు. దాని మీద అంచనాలు అందుకునేలా దర్శక…

3 hours ago

శాంతి కోసం చాలా కష్టపడ్డారు కానీ

తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ జంటగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి మొన్న శుక్రవారం విడుదలయ్యింది. ప్రమోషన్లు బాగానే…

5 hours ago